ETV Bharat / state

కృష్ణా జిల్లాలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి దారుణ హత్య... పెదగౌడపాలెం కలకలం

కృష్ణా జిల్లాలో నాగాయలంక మండలం పెదగౌడపాలెం తెదేపా అధ్యక్షుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. రద్దైన స్థానిక సంస్థల ఎన్నికలలో మృతుడు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jul 1, 2020, 6:07 PM IST

Updated : Jul 1, 2020, 7:03 PM IST

a person murder in pedagoudapalem
తెదేపా అధ్యక్షుడి గొంతుకోసి హత్య

కృష్ణా జిల్లాలో నాగాయలంక మండలంలో పెదగౌడపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 35 ఏళ్ల తాతా సాంబయ్య అనే తెదేపా అధ్యక్షుడిని హత్య చేశారు. నాగాయలంక నుంచి ఇంటికి బైక్​పై వెళ్తున్న సాంబయ్యను మెరకపాలెం రోడ్డు వద్ద గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. రద్దైన స్థానిక సంస్థల ఎన్నికలలో మృతుడు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న అవనిగడ్డ సీఐ. బి. బీమేశ్వర రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్​ను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు.

సాంబయ్యకు ఎవరితోనైనా గొడవలున్నాయా..? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

కృష్ణా జిల్లాలో నాగాయలంక మండలంలో పెదగౌడపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 35 ఏళ్ల తాతా సాంబయ్య అనే తెదేపా అధ్యక్షుడిని హత్య చేశారు. నాగాయలంక నుంచి ఇంటికి బైక్​పై వెళ్తున్న సాంబయ్యను మెరకపాలెం రోడ్డు వద్ద గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. రద్దైన స్థానిక సంస్థల ఎన్నికలలో మృతుడు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న అవనిగడ్డ సీఐ. బి. బీమేశ్వర రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్​ను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు.

సాంబయ్యకు ఎవరితోనైనా గొడవలున్నాయా..? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా

Last Updated : Jul 1, 2020, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.