ETV Bharat / state

27న ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. గత డిసెంబర్ 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

author img

By

Published : Jan 10, 2021, 10:35 AM IST

a-man-suspicious-death-in-bhatlapenumarru
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా మెువ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలీ గత ఏడాది డిసెంబర్ 27న పురుగుల మందు తాగాడు. బంధువులు వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఈ నెల 6న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

మృతుడు అడంగల్​లో పేరు నమోదు కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేక.. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది ఆగమేఘాల మీద అడంగల్​లో పేరు నమోదు చేసినట్టు ఆరోపించారు. కూచిపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

కృష్ణా జిల్లా మెువ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలీ గత ఏడాది డిసెంబర్ 27న పురుగుల మందు తాగాడు. బంధువులు వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఈ నెల 6న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

మృతుడు అడంగల్​లో పేరు నమోదు కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేక.. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది ఆగమేఘాల మీద అడంగల్​లో పేరు నమోదు చేసినట్టు ఆరోపించారు. కూచిపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

శంషాబాద్ విమానాశ్రయంలో.. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.