ETV Bharat / state

BRIDGE COLLAPSED: కూలింది వారధి.. గ్రామస్థులకు దారేదీ? - Sixty year old bridge collapsed

అరవై ఏళ్ల నాటి ఓ వంతెన కుప్పకూలింది. ఈ సమయంలో దానిపై ప్రయాణిస్తున్న 10 టన్నుల కంకర లోడుతో వెళ్తున్న లారీ శిథిలాల మధ్య ఇరుక్కుపోయింది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని పోల్‌రాజ్‌ కాలువపై ఈ ఘటన జరిగింది.

bridge Collapsed
కూలిన వంతెన
author img

By

Published : Jul 7, 2021, 7:19 AM IST

Updated : Jul 7, 2021, 12:53 PM IST

కూలిన వంతెన

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని పోల్‌రాజ్‌ కాలువపై ఉన్న 60 ఏళ్ల నాటి వంతెన సామర్థ్యానికి మించి బరువు వల్ల మంగళవారం కుప్పకూలింది. పాతకాలం నాటి వంతెన కావడం, ఇక్కడి చేపల చెరువుల వద్దకు తరచూ భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బలహీనంగా మారింది. మంగళవారం ఉదయం 10 టన్నుల కంకర లోడుతో పేరూరు వెళ్తున్న లారీ వంతెనపైకి చేరుకోగానే ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన మధ్య భాగంలో లారీ ఇరుక్కుపోయింది. డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. పేరూరు, కలవపూడి సత్రం మధ్య రాకపోకలకు, చుట్టుపక్కల గ్రామస్థులు గుడివాడకు వెళ్లడానికి ఈ మార్గం ఎంతో కీలకం. వంతెన కూలటంతో దాకరం, ముదినేపల్లి మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ... missing: పిచ్చుకలంకలో ఇద్దరు యువకులు గల్లంతు

కూలిన వంతెన

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని పోల్‌రాజ్‌ కాలువపై ఉన్న 60 ఏళ్ల నాటి వంతెన సామర్థ్యానికి మించి బరువు వల్ల మంగళవారం కుప్పకూలింది. పాతకాలం నాటి వంతెన కావడం, ఇక్కడి చేపల చెరువుల వద్దకు తరచూ భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బలహీనంగా మారింది. మంగళవారం ఉదయం 10 టన్నుల కంకర లోడుతో పేరూరు వెళ్తున్న లారీ వంతెనపైకి చేరుకోగానే ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన మధ్య భాగంలో లారీ ఇరుక్కుపోయింది. డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. పేరూరు, కలవపూడి సత్రం మధ్య రాకపోకలకు, చుట్టుపక్కల గ్రామస్థులు గుడివాడకు వెళ్లడానికి ఈ మార్గం ఎంతో కీలకం. వంతెన కూలటంతో దాకరం, ముదినేపల్లి మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ... missing: పిచ్చుకలంకలో ఇద్దరు యువకులు గల్లంతు

Last Updated : Jul 7, 2021, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.