ETV Bharat / state

Kakinada TDP Zone-2 Meeting Updates: 'అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచం..ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తీసుకుంటాం'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 8:35 PM IST

Kakinada TDP Zone-2 Meeting Updates: కాకినాడలో నిర్వహించిన జోన్‌-2 సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త కొత్త పేర్లు పెట్టి విద్యుత్ ఛార్జీలు బాదుతున్నారని ఆగ్రహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలను పెంచమని, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు.

Kakinada_TDP_ Zone2_ Meeting_Updates
Kakinada_TDP_ Zone2_ Meeting_Updates

Kakinada TDP Zone-2 Meeting Updates: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో నిర్వహించిన జోన్‌-2 సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌పై, వైఎస్సార్సీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇకపై సైకిల్‌ అన్‌స్టాపబుల్‌.. బ్రేకులు వేయాల్సిన పనే లేదు.. ప్రతి నియోజకవర్గం నుంచి అమరావతికి సైకిల్ పంపాలి.. జాబు రావాలంటే బాబు రావాల్సిందే.. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఎన్నికల్లో ఈ విధ్వంసక వైసీపీని ఇంటికి పంపండి-తెలుగుదేశం పార్టీని అమరావతికి పంపండి.' అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Chandrababu Said Dialogues in Rajinikanth Style: 'బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ' 45 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడలో నిర్వహించిన జోన్‌-2 సమీక్ష సమావేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. మధ్య మధ్యలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ స్టైల్‌లో డైలాగ్‌లు చెప్పి, పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. గత నాలుగేళ్ల పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన విధ్వంసాల గురించి చంద్రబాబు ఒక్కొక్కటిగా వివరించారు.

Babu Surety Future Guarantee Program: 45 రోజులు.. 3 కోట్ల మంది ఓటర్లను కలవడమే లక్ష్యం.. ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’

Chandrababu Comments: ''ఇటీవల జరిగిన ఎన్నికల్లో మనమే గెలిచాం. మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. దేవుడు రాసిన స్క్రిప్ట్‌ తిరగబడింది. రేపు ఎన్నికలు పెట్టినా టీడీపీ జెండా ఎగరడం ఖాయం. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. ఇంత విధ్వంసకర పాలన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ లేని విధంగా నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్యుల నడ్డి విరిగింది. కందిపప్పు డబుల్ సెంచరీ దాటింది. ధరల పెరుగుదలపై ఎవరైనా అడిగితే దాడులు, కేసులు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లోనూ అరాచకాలు, హత్యలు చేశారు.'' అని చంద్రబాబు అన్నారు.

Chandrababu Open Letter to AP People: ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ'.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu Fire on Cm Jagan: అంతేకాకుండా, రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు.. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తాము తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. ఇంటి నుంచే పని చేసుకునే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. వెనుకబడిన వర్గాలు..తెలుగుదేశంకి వెన్నెముక అని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక ప్రణాళిక తెచ్చి.. ఎస్సీలను ఆదుకుంటామన్నారు. గ్రామాల్లో రోడ్లు మరమ్మతు చేయలేని వ్యక్తి.. 3 రాజధానులు కడతారా..? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమ పంటలను కాపాడిన పార్టీ తెలుగుదేశమన్న చంద్రబాబు.. తాము అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తి చేసేవాళ్లమన్నారు.

Chandrababu on Current Charges: జగన్ పరిపాలనలో డబ్బు సంపాదన తప్ప, వైసీపీ నేతలకు మరో పనిలేదని చంద్రబాబు మండిపడ్డారు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇసుక దొరక్క పేదలు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారన్న చంద్రబాబు..టీడీపీ హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్లమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక.. కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెరిగాయని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ వచ్చాక కరెంట్ ఛార్జీలను పెంచమని చంద్రబాబు హామీ ఇచ్చారు.

TDP Leader Kalava Srinivasa Rao on Power Cuts in State: "రాష్ట్రంలో కరెంట్ కోతలు.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి"

Kakinada TDP Zone-2 Meeting Updates: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో నిర్వహించిన జోన్‌-2 సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌పై, వైఎస్సార్సీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇకపై సైకిల్‌ అన్‌స్టాపబుల్‌.. బ్రేకులు వేయాల్సిన పనే లేదు.. ప్రతి నియోజకవర్గం నుంచి అమరావతికి సైకిల్ పంపాలి.. జాబు రావాలంటే బాబు రావాల్సిందే.. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఎన్నికల్లో ఈ విధ్వంసక వైసీపీని ఇంటికి పంపండి-తెలుగుదేశం పార్టీని అమరావతికి పంపండి.' అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Chandrababu Said Dialogues in Rajinikanth Style: 'బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ' 45 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడలో నిర్వహించిన జోన్‌-2 సమీక్ష సమావేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. మధ్య మధ్యలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ స్టైల్‌లో డైలాగ్‌లు చెప్పి, పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. గత నాలుగేళ్ల పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన విధ్వంసాల గురించి చంద్రబాబు ఒక్కొక్కటిగా వివరించారు.

Babu Surety Future Guarantee Program: 45 రోజులు.. 3 కోట్ల మంది ఓటర్లను కలవడమే లక్ష్యం.. ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’

Chandrababu Comments: ''ఇటీవల జరిగిన ఎన్నికల్లో మనమే గెలిచాం. మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. దేవుడు రాసిన స్క్రిప్ట్‌ తిరగబడింది. రేపు ఎన్నికలు పెట్టినా టీడీపీ జెండా ఎగరడం ఖాయం. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. ఇంత విధ్వంసకర పాలన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ లేని విధంగా నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్యుల నడ్డి విరిగింది. కందిపప్పు డబుల్ సెంచరీ దాటింది. ధరల పెరుగుదలపై ఎవరైనా అడిగితే దాడులు, కేసులు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లోనూ అరాచకాలు, హత్యలు చేశారు.'' అని చంద్రబాబు అన్నారు.

Chandrababu Open Letter to AP People: ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ'.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu Fire on Cm Jagan: అంతేకాకుండా, రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు.. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తాము తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. ఇంటి నుంచే పని చేసుకునే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. వెనుకబడిన వర్గాలు..తెలుగుదేశంకి వెన్నెముక అని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక ప్రణాళిక తెచ్చి.. ఎస్సీలను ఆదుకుంటామన్నారు. గ్రామాల్లో రోడ్లు మరమ్మతు చేయలేని వ్యక్తి.. 3 రాజధానులు కడతారా..? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమ పంటలను కాపాడిన పార్టీ తెలుగుదేశమన్న చంద్రబాబు.. తాము అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తి చేసేవాళ్లమన్నారు.

Chandrababu on Current Charges: జగన్ పరిపాలనలో డబ్బు సంపాదన తప్ప, వైసీపీ నేతలకు మరో పనిలేదని చంద్రబాబు మండిపడ్డారు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇసుక దొరక్క పేదలు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారన్న చంద్రబాబు..టీడీపీ హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్లమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక.. కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెరిగాయని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ వచ్చాక కరెంట్ ఛార్జీలను పెంచమని చంద్రబాబు హామీ ఇచ్చారు.

TDP Leader Kalava Srinivasa Rao on Power Cuts in State: "రాష్ట్రంలో కరెంట్ కోతలు.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.