ETV Bharat / state

Yerrabalem Nalla Cheruvu: ప్రమాదకరంగా ఎర్రబాలెం నల్ల చెరువు కట్ట.. ఏడాదిన్నర కాలంలో 15మంది మృతి

author img

By

Published : Jun 12, 2023, 10:17 AM IST

Yerrabalem Nalla Cheruvu Katta: రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే ప్రధాన మార్గాల్లో అది ఒకటి. మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు నిత్యం ఆ రహదారిలోనే రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి కీలక ప్రదేశంలో ఓ చెరువు మృత్యు ద్వారాన్ని తలపిస్తోంది. రక్షణ గోడలు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్యలు మాత్రం శూన్యం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం చెరువు కట్ట.. ప్రమాదభరితంగా మారిన వైనంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

yerrabalem road
yerrabalem road
ప్రమాదకరంగా ఎర్రబాలెం నల్ల చెరువు కట్ట

Yerrabalem Nalla Cheruvu Katta: గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్ట్ర సచివాలయానికి వెళ్లే ప్రతి వాహనం ఎర్రబాలెం నల్ల చెరువు కట్ట రహదారిపై నుంచే వెళ్లాలి. గతంలో కేవలం గ్రామాల మధ్య రాకపోకలకు మాత్రమే ఈ రహదారిని వినియోగించేవారు. అమరావతి రాజధాని అయ్యాక వాహనాల రద్దీ పెరిగింది. రోజూ వేలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. మంగళగిరి నుంచి రాజధాని గ్రామాలతో పాటు సచివాలయం, హైకోర్టు, శాసనసభ, అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయానికి ఈ మార్గం మీదుగానే వెళ్తుంటారు. చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు కూడా ఇదే దారిలో వెళ్లి వస్తుంటారు. అలాంటి కీలకమైన రహదారి ఎర్రబాలెం చెరువు కట్టపై ఇరుగ్గా ఉంటుంది. చెరువు నీటి అలలకు రహదారి క్రమంగా కోతకు గురవుతోంది. దీనికి తోడు చెరువుకట్ట వెంట మూడు చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి.

"రెండు కార్లు ఓ సారి చెరువులో పడ్డాయి. ఆ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో చెరువు కోతకు గురైంది. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆర్​ అండ్​ బీ అధికారులకు ఫిర్యాదు చేసిన దీనిని పట్టించుకోలేదు"-స్థానికులు

వాహనదారులు రాత్రి సమయాల్లో చెరువు అంచు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు చెరువులోకి దూసుకెళ్లి మరణిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో.. ప్రమాదాల కారణంగా సుమారు 15మంది వరకు మృతి చెందారు. 2022 జనవరి 17న రాత్రి సమయంలో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లటంతో నలుగురు యువకులు మృత్యువాత పడ్డారు. స్థానికులు సకాలంలో స్పందించి అద్దాలను పగుల గొట్టి కారులో వారిని బయటకు తీసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. రక్షణ గోడ నిర్మించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"వర్షాలు పడినప్పుడు ఈ రోడ్డు కోతకు గురవుతోంది. మొన్న అమరావతిలో సెంటు స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్​ వచ్చిన సందర్భంలో ఈ చెరువుకు రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతే కానీ దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేదు"-స్థానికులు

ఈ ఏడాది ఏప్రిల్ 29న జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. అలాగే మే 3న మంగళగిరికి చెందిన జంజనం కేశవరావు అనే పోస్ట్‌మెన్‌ బైక్‌పై వెళ్తూ వేరే వాహనానికి సైడ్ ఇవ్వబోయి చెరువులో పడిపోయారు. ఆయన మృతదేహం తేలే వరకూ ప్రమాదం జరిగిన విషయం కూడా ఎవరూ గుర్తించలేకపోయారు. ఇటీవల రాజధానిలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ రోజు వందలాది వాహనాలు ఈ మార్గంలో వెళ్లాల్సి రావటంతో మలుపుల వద్ద కర్రలు కట్టారు. సమస్యకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు గానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.

చెరువు చుట్టూ రక్షణ చర్యలు, మరమ్మతుల గురించి.. రహదారులు, భవనాల శాఖ అధికారుల్ని అడిగితే.. 2 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అవి ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

ప్రమాదకరంగా ఎర్రబాలెం నల్ల చెరువు కట్ట

Yerrabalem Nalla Cheruvu Katta: గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్ట్ర సచివాలయానికి వెళ్లే ప్రతి వాహనం ఎర్రబాలెం నల్ల చెరువు కట్ట రహదారిపై నుంచే వెళ్లాలి. గతంలో కేవలం గ్రామాల మధ్య రాకపోకలకు మాత్రమే ఈ రహదారిని వినియోగించేవారు. అమరావతి రాజధాని అయ్యాక వాహనాల రద్దీ పెరిగింది. రోజూ వేలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. మంగళగిరి నుంచి రాజధాని గ్రామాలతో పాటు సచివాలయం, హైకోర్టు, శాసనసభ, అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయానికి ఈ మార్గం మీదుగానే వెళ్తుంటారు. చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు కూడా ఇదే దారిలో వెళ్లి వస్తుంటారు. అలాంటి కీలకమైన రహదారి ఎర్రబాలెం చెరువు కట్టపై ఇరుగ్గా ఉంటుంది. చెరువు నీటి అలలకు రహదారి క్రమంగా కోతకు గురవుతోంది. దీనికి తోడు చెరువుకట్ట వెంట మూడు చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి.

"రెండు కార్లు ఓ సారి చెరువులో పడ్డాయి. ఆ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో చెరువు కోతకు గురైంది. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆర్​ అండ్​ బీ అధికారులకు ఫిర్యాదు చేసిన దీనిని పట్టించుకోలేదు"-స్థానికులు

వాహనదారులు రాత్రి సమయాల్లో చెరువు అంచు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు చెరువులోకి దూసుకెళ్లి మరణిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో.. ప్రమాదాల కారణంగా సుమారు 15మంది వరకు మృతి చెందారు. 2022 జనవరి 17న రాత్రి సమయంలో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లటంతో నలుగురు యువకులు మృత్యువాత పడ్డారు. స్థానికులు సకాలంలో స్పందించి అద్దాలను పగుల గొట్టి కారులో వారిని బయటకు తీసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. రక్షణ గోడ నిర్మించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"వర్షాలు పడినప్పుడు ఈ రోడ్డు కోతకు గురవుతోంది. మొన్న అమరావతిలో సెంటు స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్​ వచ్చిన సందర్భంలో ఈ చెరువుకు రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతే కానీ దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేదు"-స్థానికులు

ఈ ఏడాది ఏప్రిల్ 29న జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. అలాగే మే 3న మంగళగిరికి చెందిన జంజనం కేశవరావు అనే పోస్ట్‌మెన్‌ బైక్‌పై వెళ్తూ వేరే వాహనానికి సైడ్ ఇవ్వబోయి చెరువులో పడిపోయారు. ఆయన మృతదేహం తేలే వరకూ ప్రమాదం జరిగిన విషయం కూడా ఎవరూ గుర్తించలేకపోయారు. ఇటీవల రాజధానిలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ రోజు వందలాది వాహనాలు ఈ మార్గంలో వెళ్లాల్సి రావటంతో మలుపుల వద్ద కర్రలు కట్టారు. సమస్యకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు గానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.

చెరువు చుట్టూ రక్షణ చర్యలు, మరమ్మతుల గురించి.. రహదారులు, భవనాల శాఖ అధికారుల్ని అడిగితే.. 2 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అవి ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.