ETV Bharat / state

వైకాపా నాయకుడి అక్రమాలు... అడ్డుకున్న రైతుపై దాడి

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ వద్ద నక్ వాగు పక్కన నిర్మించిన చారిత్రక అలుగు కట్ట మట్టిని తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. విషయం తెలిసినా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవటం విస్మయానికి గురిచేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

author img

By

Published : May 8, 2020, 6:28 PM IST

వైకాపా నాయకుడి అక్రమాలు...అడ్డుకున్న రైతుపై దాడి
వైకాపా నాయకుడి అక్రమాలు...అడ్డుకున్న రైతుపై దాడి

లాక్ డౌన్ కారణంగా అధికారులు ఉదాసీనంగా ఉండటంతో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ వద్ద చారిత్రక మట్టికట్టను తొలగించి... మట్టిని స్థానిక వైకాపా నాయకుడు విక్రయిస్తున్నారు. నాదెండ్ల- చిరుమామిళ్ళ మధ్య కాటం రాజుల కాలంలో నక్కవాగు పక్కన పొలాలు ముంపునకు గురికాకుండా మట్టితో ఈ కట్టను నిర్మించారు. గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకుడి కన్ను దీనిపై పడింది. పది రోజులుగా రాత్రివేళ కట్ట మట్టిని తవ్వి టిప్పర్​లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ విషయం పోలీస్, రెవెన్యూ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆగ్రహించిన అదే గ్రామానికి చెందిన రైతు భవనం మస్తాన్ రెడ్డి... మట్టి తవ్వకాలను అడ్డుకున్నాడు. సదరు వైకాపా నాయకుడి కుమారుడు ఆ రైతుపై దాడిచేశాడు.

లాక్ డౌన్ కారణంగా అధికారులు ఉదాసీనంగా ఉండటంతో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ వద్ద చారిత్రక మట్టికట్టను తొలగించి... మట్టిని స్థానిక వైకాపా నాయకుడు విక్రయిస్తున్నారు. నాదెండ్ల- చిరుమామిళ్ళ మధ్య కాటం రాజుల కాలంలో నక్కవాగు పక్కన పొలాలు ముంపునకు గురికాకుండా మట్టితో ఈ కట్టను నిర్మించారు. గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకుడి కన్ను దీనిపై పడింది. పది రోజులుగా రాత్రివేళ కట్ట మట్టిని తవ్వి టిప్పర్​లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ విషయం పోలీస్, రెవెన్యూ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆగ్రహించిన అదే గ్రామానికి చెందిన రైతు భవనం మస్తాన్ రెడ్డి... మట్టి తవ్వకాలను అడ్డుకున్నాడు. సదరు వైకాపా నాయకుడి కుమారుడు ఆ రైతుపై దాడిచేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.