ETV Bharat / state

చినకాకుమాను గ్రామస్థుల దుస్థితిపై.. హోం మంత్రి స్పందన

ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామస్థులు పడుతున్న ఇబ్బందికి పరిష్కారం లభించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాడు సాయంతో కాల్వ దాటుతున్న వారి సమస్యను ఈటీవీ, ఈటీవీ భారత్ వెలుగులోకి తేవటంతో హోం మంత్రి సుచరిత స్పందించారు. సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Aug 31, 2019, 6:02 PM IST

తాడుబాట

గుంటూరు జిల్లా చినకాకుమానులో కాల్వ దాటేందుకు గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. వెంటనే గ్రామస్థులకు బోటు ఏర్పాటు చేయాలని.. నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో గ్రామానికి వచ్చిన అధికారులు అక్కడి ప్రజలతో మాట్లాడారు. కాలువ దాటేందుకు వీలుగా త్వరలోనే బోటు అందజేస్తామని తెలిపారు. కొత్త బోటు కొనుగోలుకు 4 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే శాశ్వత పరిష్కారం కోసం వంతెన నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని గ్రామస్థులకు తెలిపారు.

తాడే ఆధారం
చినకాకుమాను రైతులకు చెందిన పొలాలు కాలువకు ఆవతలివైపు ఉండటంతో.. వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. జోరుగా ఉన్న నీటి ప్రవాహంలో తాడు సాయంతో కాలువ అవతలికి దాటేందుకు గ్రామస్థులు ప్రాణాలకు తెగించిన వైనాన్ని ఈటీవీ, ఈటీవీ భారత్ వెలుగులోకి తేవటంతో హోం మంత్రి స్పందించారు. తమ బాధలు తీరనున్నందున గ్రామస్థులు హర్షం వెలిబుచ్చారు.

గుంటూరు జిల్లా చినకాకుమానులో కాల్వ దాటేందుకు గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. వెంటనే గ్రామస్థులకు బోటు ఏర్పాటు చేయాలని.. నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో గ్రామానికి వచ్చిన అధికారులు అక్కడి ప్రజలతో మాట్లాడారు. కాలువ దాటేందుకు వీలుగా త్వరలోనే బోటు అందజేస్తామని తెలిపారు. కొత్త బోటు కొనుగోలుకు 4 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే శాశ్వత పరిష్కారం కోసం వంతెన నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని గ్రామస్థులకు తెలిపారు.

తాడే ఆధారం
చినకాకుమాను రైతులకు చెందిన పొలాలు కాలువకు ఆవతలివైపు ఉండటంతో.. వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. జోరుగా ఉన్న నీటి ప్రవాహంలో తాడు సాయంతో కాలువ అవతలికి దాటేందుకు గ్రామస్థులు ప్రాణాలకు తెగించిన వైనాన్ని ఈటీవీ, ఈటీవీ భారత్ వెలుగులోకి తేవటంతో హోం మంత్రి స్పందించారు. తమ బాధలు తీరనున్నందున గ్రామస్థులు హర్షం వెలిబుచ్చారు.

ఇదీ చదవండి..

బతుకు పోరాటం...నీటి ప్రవాహంలో సాహసం..

Intro:పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు ఉన్నత పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 71వ మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు పుప్పాల శ్రీనివాసరావు, తలారి వెంకట్రావు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.Body:ఉంగుటూరుConclusion:9493990333

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.