ETV Bharat / state

amaravathi: 591వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం..

author img

By

Published : Jul 30, 2021, 6:24 PM IST

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 591వ రోజు ఆందోళనలు చేశారు. అమరావతిలో మట్టి, ఇసుక, కంకర తీసుకెళ్లిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కిందిస్థాయి వ్యక్తులను కాకుండా అసలైన దొంగలను పట్టుకోవాలని రైతులు, మహిళలు కోరారు.

Amravati farmers protest
అమరావతి రైతుల నిరసన

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన 591వ రోజుకు చేరింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి, బోరుపాలెం, నెక్కల్లు, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. జై అమరావతి అంటూ నినదించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద గాయత్రి మహామంత్రం, భగవద్గీత పారాయణం పఠించారు సకల దేవతల చల్లనిచూపు, కరుణా కటాక్షాలు రాజధాని అమరావతిపై ఉండాలని కోరుకున్నారు. అమరావతిలో మట్టి, ఇసుక, కంకర తీసుకెళ్లిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కిందిస్థాయి వ్యక్తులను కాకుండా అసలైన దొంగలను పట్టుకోవాలని రైతులు, మహిళలు కోరారు. పోలీసుల చర్యలు తూతూ మంత్రంలా ఉన్నాయని ఆరోపించారు.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన 591వ రోజుకు చేరింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి, బోరుపాలెం, నెక్కల్లు, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. జై అమరావతి అంటూ నినదించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద గాయత్రి మహామంత్రం, భగవద్గీత పారాయణం పఠించారు సకల దేవతల చల్లనిచూపు, కరుణా కటాక్షాలు రాజధాని అమరావతిపై ఉండాలని కోరుకున్నారు. అమరావతిలో మట్టి, ఇసుక, కంకర తీసుకెళ్లిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కిందిస్థాయి వ్యక్తులను కాకుండా అసలైన దొంగలను పట్టుకోవాలని రైతులు, మహిళలు కోరారు. పోలీసుల చర్యలు తూతూ మంత్రంలా ఉన్నాయని ఆరోపించారు.

ఇదీ చదవండీ.. విశాఖ మన్యంలో లాటరైట్ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.