గుంటూరు జిల్లా గోరంట్ల సెయింట్ ఆన్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్లో వైకాపాకి దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా పోలింగ్ ఏజెంట్లు ఆందోళన చేశారు. రెండు వర్గాల పోలింగ్ ఏజెంట్ల మధ్య వివాదం జరిగింది. ఆందోళనకారులను పోలీసులు బూత్ నుంచి బయటకు పంపారు. అప్పటికి వివాదం కొనసాగుతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి తరిమికొట్టారు.
ఇదీ చదవండి