ETV Bharat / state

పొలం గట్టు సరిహద్దు వివాదం.. పరిష్కారం చూపిన తహసీల్దార్ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ఏళ్ల తరబడి అన్నదమ్ముల మధ్య నలుగుతున్న పొలం గట్టు వివాదాన్ని గుంటూరు జిల్లా దాచేపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ పరిష్కరించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమిని కచ్చితంగా కొలత వేసి ఎవరి భాగాన్ని వారికి చట్టబద్ధంగా అప్పగించాలని సిబ్బందిని ఆదేశించారు.

పొలం గట్టు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించిన తహసీల్దార్
పొలం గట్టు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించిన తహసీల్దార్
author img

By

Published : Jul 14, 2021, 5:22 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో ఇద్దరు సోదరుల మధ్య ఏళ్ల తరబడి పొలం గట్టు వివాదం కొనసాగుతోంది. పొలం సరిహద్దు గట్ల విషయంలో సమస్య పరిష్కారానికి అధికారుల నుంచి స్పందన కొరవడింది.

ఈ నేపథ్యంలో వీఆర్వో, సర్వే సిబ్బందితో కలిసి రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్న పొలంలో నడుచుకుంటూ వెళ్లి న తహసీల్దార్ వెంకటేశ్వర్లు... వివాదంలో ఉన్న పొలాన్ని పరిశీలించారు. పొలం యజమానులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమిని కచ్చితంగా కొలత వేసి ఎవరి భాగాన్ని వారికి చట్టబద్ధంగా అప్పగించాలని రెవెన్యూ బృందానికి ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో ఇద్దరు సోదరుల మధ్య ఏళ్ల తరబడి పొలం గట్టు వివాదం కొనసాగుతోంది. పొలం సరిహద్దు గట్ల విషయంలో సమస్య పరిష్కారానికి అధికారుల నుంచి స్పందన కొరవడింది.

ఈ నేపథ్యంలో వీఆర్వో, సర్వే సిబ్బందితో కలిసి రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్న పొలంలో నడుచుకుంటూ వెళ్లి న తహసీల్దార్ వెంకటేశ్వర్లు... వివాదంలో ఉన్న పొలాన్ని పరిశీలించారు. పొలం యజమానులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమిని కచ్చితంగా కొలత వేసి ఎవరి భాగాన్ని వారికి చట్టబద్ధంగా అప్పగించాలని రెవెన్యూ బృందానికి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

SANGAM DAIRY: 'ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ రద్దు పిటిషన్'.. కొట్టేసిన హై కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.