ETV Bharat / state

కారు దగ్ధం....తప్పిన ప్రమాదం - Sudden car fire news

అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగి ఇరువురికి తృటిలో ప్రమాదం తప్పిన ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.

car fire
car fire
author img

By

Published : May 5, 2021, 9:54 AM IST

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ సమీపంలో....ఆకస్మాత్తుగా ఓ కారులో మంటలు చెలరేగి ఇరువురికి తృటిలో ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళితే..

నకరికల్లు మండలం రూపెనగుంట్లకు చెందిన మాజీ సర్పంచి వేల్పుల ఆదినారాయణ తన వియ్యంకుడిని నరసరావుపేటలో దింపి వచ్చేందుకు రూపెనగుంట్ల గ్రామం నుంచి తన కారులో బయలుదేరాడు. శాంతినగర్ సమీపంలోని నరసరావుపేట - హైదరాబాద్ ప్రధాన రహదారిపైకి వచ్చే సమయంలో కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఇద్దరు కారులో నుంచి బయటకు దిగి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కారు మాత్రం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ సమీపంలో....ఆకస్మాత్తుగా ఓ కారులో మంటలు చెలరేగి ఇరువురికి తృటిలో ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళితే..

నకరికల్లు మండలం రూపెనగుంట్లకు చెందిన మాజీ సర్పంచి వేల్పుల ఆదినారాయణ తన వియ్యంకుడిని నరసరావుపేటలో దింపి వచ్చేందుకు రూపెనగుంట్ల గ్రామం నుంచి తన కారులో బయలుదేరాడు. శాంతినగర్ సమీపంలోని నరసరావుపేట - హైదరాబాద్ ప్రధాన రహదారిపైకి వచ్చే సమయంలో కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఇద్దరు కారులో నుంచి బయటకు దిగి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కారు మాత్రం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.

ఇదీ చదవండి

కేజీహెచ్​పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.