ETV Bharat / state

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో సబ్​కలెక్టర్ సమీక్ష

author img

By

Published : Mar 2, 2021, 8:53 AM IST

రాష్ట్రంలో పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లను... ఈ నెల 11 నుంచి ప్రభుత్వం నిర్వహించనుంది. జాతర ఏర్పాట్లపై జిల్లా సబ్​కలెక్టర్ శ్రీవాస్​నుపూర్​ అజయ్​కుమార్​.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

sub collector
కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో సబ్​కలెక్టర్ సమీక్ష

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్​కుమార్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల మహోత్సవాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11వ తేదీన నిర్వహించనున్నారు. ఏ శాఖలు ఎంతమేరకు పనులు పూర్తి చేశాయన్న విషయాన్ని సబ్​ కలెక్టర్.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తిరునాళ్ల ప్రారంభమవడానికి కనీసం రెండు రోజుల ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, రవాణా తదితర అంశాలపై అధికారులకు.. సబ్ కలెక్టర్ పలు సూచనలు చేశారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్​రావు మాట్లాడుతూ తిరునాళ్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు.

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్​కుమార్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల మహోత్సవాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11వ తేదీన నిర్వహించనున్నారు. ఏ శాఖలు ఎంతమేరకు పనులు పూర్తి చేశాయన్న విషయాన్ని సబ్​ కలెక్టర్.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తిరునాళ్ల ప్రారంభమవడానికి కనీసం రెండు రోజుల ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, రవాణా తదితర అంశాలపై అధికారులకు.. సబ్ కలెక్టర్ పలు సూచనలు చేశారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్​రావు మాట్లాడుతూ తిరునాళ్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇదీ చదవండి:

440వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.