ETV Bharat / state

ఆరునెలల్లో ఆ తల్లికి ఇద్దరు కుమారులు దూరం - పెదరావూరు రోడ్డు ప్రమాదం

విధి ఆ తల్లికి ఇద్దరు కుమారులను ఒకే రూపంలో కబళించింది. ఆరునెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్న కుమారుడిని మరుక ముందే.. నేడు పెద్ద కొడుకు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామంలో జరిగింది.

road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Apr 5, 2021, 11:55 AM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని పెదరావూరు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొల్లూరు గ్రామానికి చెందిన గోపికృష్ణ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. గోపికృష్ణ తెనాలి నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించినట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది.

ఆరు నెలల వ్యవధిలోనే....

గోపి కృష్ణ తమ్ముడు ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాజాగా అదే విధంగా జరిగిన ప్రమాదంలో గోపికృష్ణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండీ.. మిషన్‌ అరుస్తోంది.. నిజం చెప్పు!

గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని పెదరావూరు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొల్లూరు గ్రామానికి చెందిన గోపికృష్ణ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. గోపికృష్ణ తెనాలి నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించినట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది.

ఆరు నెలల వ్యవధిలోనే....

గోపి కృష్ణ తమ్ముడు ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాజాగా అదే విధంగా జరిగిన ప్రమాదంలో గోపికృష్ణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండీ.. మిషన్‌ అరుస్తోంది.. నిజం చెప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.