ETV Bharat / state

ఎలుకను పట్టు...50 కొట్టు

author img

By

Published : Nov 12, 2019, 3:24 PM IST

ఒక్కో ఎలుక 50 రూపాయలు. ఏంటీ.. అంత రేటు పెట్టి కొనుక్కోవాలా అనుకోకండి. ఇది ఎలుకను కొనుక్కునే రేటు కాదు...ఎలుకను పట్టుకున్నందుకు కూలీలకు చెల్లించే రేటు. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇంత డబ్బులు ఖర్చు చేస్తున్నారంటే.. ఆశ్చర్యం కలుగక తప్పదు. పంట చేతికొచ్చే తరుణంలో నిట్టనిలువునా గుల్ల చేస్తున్నందున.. చేసేదేమీ లేదంటూ అన్నదాతలు వాపోతున్నారు.

ఎలుకను పట్టు...50 కొట్టు
ఎలుకను పట్టు...50 కొట్టు

గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్‌తో పాటు ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు కింద సుమారు 2లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. చీడపీడలతో పాటు ఈసారి ఎలుకల బెడద కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. పొలం గట్ల వెంబడి బొరియల్లో దాగిన ఎలుకలు పంటలను పాడు చేస్తున్నాయి. ప్రస్తుతానికి వరికంకులు చిరుపొట్ట దశలో ఉన్నాయి. ఇంతటి కీలకమైన సమయంలో ఎలుకలు విజృంభించి పంటను నాశనం చేస్తున్నాయి. రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇదే సమయంలో ఎలుకల నివారణకు డిమాండ్ పెరిగింది. ఒక్కో ఎలుకను పట్టుకున్నందుకు 30నుంచి 50 రూపాయల వరకూ చెల్లించాల్సి వస్తోంది. పంట పెట్టుబడులకు తోడు.. ఈ ఖర్చులు తమకు అదనంగా మారాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రబీ సీజన్‌ జొన్న, మొక్కజొన్న పంటల కారణంగా ఎలుకల సంఖ్య పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఆ కంకులను ఆహారంగా తీసుకుని విపరీతంగా వృద్ధి చెందాయని.. ప్రస్తుతం వరిపైనా ప్రతాపం చూపుతున్నాయని చెబుతున్నారు.

వరదల సమయంలోనూ ఎలుకలు విపరీతంగా సంతానోత్పత్తి చేశాయి. మూషికాల తాకిడి పెరిగిపోవటంతో పంట గుల్లయిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే వాటిని పట్టుకునేవారు రావటం లేదని చెబుతున్నారు. బుట్టల ద్వారా ఎలుకలు పడితే 30 రూపాయలు, పొగద్వారా అయితే 50 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది.

ఏటా వ్యవసాయశాఖ తరపున ఎలుకల సామూహిక నివారణ కార్యక్రమం నిర్వహిస్తారు. అన్నిచోట్లా ఒకేసారి ఈ ప్రక్రియ చేపట్టినా... ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

రాజధాని స్టార్టప్ అభివృద్ధి నుంచి వైదొలిగిన సింగపూర్

ఎలుకను పట్టు...50 కొట్టు

గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్‌తో పాటు ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు కింద సుమారు 2లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. చీడపీడలతో పాటు ఈసారి ఎలుకల బెడద కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. పొలం గట్ల వెంబడి బొరియల్లో దాగిన ఎలుకలు పంటలను పాడు చేస్తున్నాయి. ప్రస్తుతానికి వరికంకులు చిరుపొట్ట దశలో ఉన్నాయి. ఇంతటి కీలకమైన సమయంలో ఎలుకలు విజృంభించి పంటను నాశనం చేస్తున్నాయి. రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇదే సమయంలో ఎలుకల నివారణకు డిమాండ్ పెరిగింది. ఒక్కో ఎలుకను పట్టుకున్నందుకు 30నుంచి 50 రూపాయల వరకూ చెల్లించాల్సి వస్తోంది. పంట పెట్టుబడులకు తోడు.. ఈ ఖర్చులు తమకు అదనంగా మారాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రబీ సీజన్‌ జొన్న, మొక్కజొన్న పంటల కారణంగా ఎలుకల సంఖ్య పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఆ కంకులను ఆహారంగా తీసుకుని విపరీతంగా వృద్ధి చెందాయని.. ప్రస్తుతం వరిపైనా ప్రతాపం చూపుతున్నాయని చెబుతున్నారు.

వరదల సమయంలోనూ ఎలుకలు విపరీతంగా సంతానోత్పత్తి చేశాయి. మూషికాల తాకిడి పెరిగిపోవటంతో పంట గుల్లయిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే వాటిని పట్టుకునేవారు రావటం లేదని చెబుతున్నారు. బుట్టల ద్వారా ఎలుకలు పడితే 30 రూపాయలు, పొగద్వారా అయితే 50 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది.

ఏటా వ్యవసాయశాఖ తరపున ఎలుకల సామూహిక నివారణ కార్యక్రమం నిర్వహిస్తారు. అన్నిచోట్లా ఒకేసారి ఈ ప్రక్రియ చేపట్టినా... ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

రాజధాని స్టార్టప్ అభివృద్ధి నుంచి వైదొలిగిన సింగపూర్

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్7 6 8 ఫోన్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:ఈ వార్తకు సంబంధించిన స్క్రిప్టు ఆఫీస్ నుంచి వచ్చింది బైక్ లు పేర్లు వారికి మాత్రం పంపిస్తున్నాను

బైట్ కావూరు సత్యనారాయణ రైతు
బైట్ ఉమాకాంత్ రైతు
బైట్ ఆనంద్ రైతు
బైట్ మీరా సాహెబ్ రైతు
బైట్ వెంకటేశ్వర్లు లు


Conclusion:గుంటూరు జిల్లా ఎలుకలతో భారీగా నష్టపోయిన పంటలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.