ETV Bharat / state

గుడికి వచ్చిన భక్తురాలితో పూజారి అసభ్య ప్రవర్తన - వైకుంఠపురంలో పూజారి అసభ్య ప్రవర్తన వార్తలు

భక్తుల కోరికలని దేవుడి వద్దకు చేర్చే పవిత్రమైన పూజారి వృత్తిలో ఉన్నాడతను. నిత్యం ఆ దేవదేవుడికి పూజాకార్యక్రమాలు నిర్వహించే అర్చకుడతడు. పూజారి అంటే ఎనలేని నమ్మకంతో ఉంటారు భక్తులు. అలాంటి వ్యక్తి... ఆ లోకానికే మచ్చ తెచ్చే పని చేశాడు. తన కోరికలను భగవంతుడికి చెప్పుకునేందుకు వచ్చిన భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లా వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలోని పూజారి ఉదంతంమిది.

priest indecent behaviour with women devotee in vykhuntapuram guntur district
మహిళా భక్తురాలితో పూజారి అసభ్య ప్రవర్తన
author img

By

Published : Nov 27, 2019, 3:50 PM IST

గుడికి వచ్చిన భక్తురాలితో పూజారి అసభ్య ప్రవర్తన

గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వేంకటేశ్వర స్వామికి ఎనలేని విశిష్టత ఉంది. ఆ స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందనే విశ్వాసం వ్యాప్తిలో ఉంది. సంతాన భాగ్యం కోసం స్వామివారిని దర్శించుకునేందుకు సోమవారం విజయవాడ నుంచి దంపతులు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అర్చకుడు నరసింహాచార్యుల పాదాలకు నమస్కారం చేశారు.

అప్పుడా పూజారి... తమ కోరిక నెరవేరాలంటే మహిళ ఒంటరిగా పూజ చేయాలని చెప్పి... ఆమెను ఆలయం లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ అరుస్తూ బయటకు వచ్చేసింది. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి నరసింహాచార్యులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి ఆలయ అధికారులకు సమాచారమిచ్చి వారు వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

శ్రీకాళహస్తి భైరవకోనలో క్షుద్రపూజలు.. ఆలయ ఏఈవోపై అనుమానం..?

గుడికి వచ్చిన భక్తురాలితో పూజారి అసభ్య ప్రవర్తన

గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వేంకటేశ్వర స్వామికి ఎనలేని విశిష్టత ఉంది. ఆ స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందనే విశ్వాసం వ్యాప్తిలో ఉంది. సంతాన భాగ్యం కోసం స్వామివారిని దర్శించుకునేందుకు సోమవారం విజయవాడ నుంచి దంపతులు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అర్చకుడు నరసింహాచార్యుల పాదాలకు నమస్కారం చేశారు.

అప్పుడా పూజారి... తమ కోరిక నెరవేరాలంటే మహిళ ఒంటరిగా పూజ చేయాలని చెప్పి... ఆమెను ఆలయం లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ అరుస్తూ బయటకు వచ్చేసింది. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి నరసింహాచార్యులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి ఆలయ అధికారులకు సమాచారమిచ్చి వారు వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

శ్రీకాళహస్తి భైరవకోనలో క్షుద్రపూజలు.. ఆలయ ఏఈవోపై అనుమానం..?

Intro:AP_GNT_71_27_MAHILA_BAKTURALIPI_POOJARI_AGAYITYAM_AVB_AP10115

విజువల్స్


Body: భక్తురాలి పై అర్చకుడి అఘాయిత్యం

పూజాది కార్యాలు నిర్వహించే అర్చకుడు దేవుడి సన్నిధిలో నే భక్తురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపిన ఉదంతం గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామములో స్వయంబుగా కొలువైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోటుచేసుకుంది. వి శ్వసనీయ సమాచారం మేరకు విజయవాడకు చెందిన భార్య భర్తల తమ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం సాయంత్రం స్వామివారి సందర్శనకు వచ్చారు. సంతాన ప్రాప్తి కోసం ఆలయంలో పూజలు జరిపారు. ఆలయంలో అర్చకుడు క్రోసూరి నరసింహా చార్యులు పాదాలకు నమస్కారం చేశారు. సంతానం కలగాలంటే మహిళతో ఆలయంలో ఒంటరిగా మాట్లాడలంటూ అప్పుడే కోరిక నెరవేరుతుందని నరసింహ చార్యలూ వారికీ మాయమాటలు చెప్పి ఆతర్వాత మహిళను ఆలయంలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించసాగడు సదరు మహిళ ప్రతిఘటించి తప్పించుకొని బిగ్గరగా అరుస్తూ బయటకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు విషయమై అరా తీసి ఆలయంలోకి వెళ్లి చూడగా అప్పటికే నరసింహ చార్యులు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులకు విషయాన్ని వివరించి వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.. ఈ ఘటన పై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈ ఓ ప్రసాద్ తెలిపారు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజరిని అదుపులో కి తీసుకొని అమరావతి పోలీసులు విచారణ చేపట్టారు..


Conclusion:AP_GNT_71_27_MAHILA_BAKTURALIPI_POOJARI_AGAYITYAM_AVB_AP10115
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.