భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల గుంటూరు జిల్లాలోని ఆకుల గణపవరంలో నేటి నుంచి 5 రోజుల పాటు జరగనుంది. మొదటి రోజున అష్టోత్తర శతనామార్చ పూజలు, సామూహిక లక్ష తమలపాకుల పూజ, సువర్చలా ఆంజనేయ కళ్యాణం, స్వామివారి కోవెల విడిది కార్యక్రమాలకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు . ఆలయ పూజారులు పరాశరం రంగాచార్యులు యువకిశోరాచార్యులు మూలవిరాట్ను బెంగుళూరు నుంచి తీసుకువచ్చిన పుష్పాలతో అలంకరించారు. ఈ ఉత్సవాల్లో ఆరు విభాగాల్లో జాతీయస్థాయి ఎడ్ల పందేలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: గుంటూరులో మే 16 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ