ETV Bharat / state

భవానీ మాలలో వచ్చాడు... బాలుడిని కిడ్నాప్ చేశాడు..! - బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం...

గుంటూరు జిల్లా రేపల్లెలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. భవానీ మాలలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన వేముల త్రినాధ్(4)ని ఎత్తుకెళ్లాడు. పోలీసులు సీసీపుటేజీని పరిశీలించి... పిడుగురాళ్ల వద్ద పిల్లాడి ఆచూకీ కనుగొన్నారు. కిడ్నాపర్​ను అరెస్టు చేశారు.

police_trace out_kidnpped_boy
భవానీ మాలలో వచ్చాడు.. బాలుడిని కిడ్నాప్ చేశాడు
author img

By

Published : Dec 11, 2019, 2:12 PM IST

మంగళవారం కిడ్నాప్​న​కు గురైన గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 24వ వార్డుకు చెందిన నాలుగేళ్ల బాలుడు వేముల త్రినాధ్​ ఆచూకిని... పోలీసులు పిడుగురాళ్ల వద్ద కనుగొన్నారు. ఇంటి బయట ఆడుకుంటుండగా... పిల్లాడిని ఎవరో కిడ్నాప్​ చేశారు. కనిపించకుండా పోవడంతో... బంధువులు ఎంత వెతికినా ప్రయోజనం లేదు. భవాని మాలధారణలో ఉన్న వ్యక్తి బాలుడిని తీసుకెళ్తుండగా స్థానికులు గమనించి... కుటుంబసభ్యులకు తెలియజేశారు.

బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో... వారు దర్యాప్తు ప్రారంభించారు. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజీలు పరిశీలించి... అన్ని పోలీస్ స్టేషన్​లకు సమాచారం అందించారు. బాలుడి కోసం గాలించారు. గుంటూరు బస్టాండ్​లో సీసీ పుటేజీని చూడగా... పిడుగురాళ్ల, నరసరావుపేట మీదుగా కిడ్నాపర్ బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. బుధవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా... పిడుగురాళ్ల వద్ద బాలుడిని చూశారు. కిడ్నాపర్​ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

భవానీ మాలలో వచ్చాడు.. బాలుడిని కిడ్నాప్ చేశాడు

ఇవీ చదవండి...రూ.5 లక్షల కోసం సోదరుడి కుమారుడిని కిడ్నాప్ చేశాడు..!

మంగళవారం కిడ్నాప్​న​కు గురైన గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 24వ వార్డుకు చెందిన నాలుగేళ్ల బాలుడు వేముల త్రినాధ్​ ఆచూకిని... పోలీసులు పిడుగురాళ్ల వద్ద కనుగొన్నారు. ఇంటి బయట ఆడుకుంటుండగా... పిల్లాడిని ఎవరో కిడ్నాప్​ చేశారు. కనిపించకుండా పోవడంతో... బంధువులు ఎంత వెతికినా ప్రయోజనం లేదు. భవాని మాలధారణలో ఉన్న వ్యక్తి బాలుడిని తీసుకెళ్తుండగా స్థానికులు గమనించి... కుటుంబసభ్యులకు తెలియజేశారు.

బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో... వారు దర్యాప్తు ప్రారంభించారు. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజీలు పరిశీలించి... అన్ని పోలీస్ స్టేషన్​లకు సమాచారం అందించారు. బాలుడి కోసం గాలించారు. గుంటూరు బస్టాండ్​లో సీసీ పుటేజీని చూడగా... పిడుగురాళ్ల, నరసరావుపేట మీదుగా కిడ్నాపర్ బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. బుధవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా... పిడుగురాళ్ల వద్ద బాలుడిని చూశారు. కిడ్నాపర్​ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

భవానీ మాలలో వచ్చాడు.. బాలుడిని కిడ్నాప్ చేశాడు

ఇవీ చదవండి...రూ.5 లక్షల కోసం సోదరుడి కుమారుడిని కిడ్నాప్ చేశాడు..!

Intro:Ap_gnt_46_11_police_trace out_kidnpped_boy_av_ap10035

నమస్కారం సర్

స్క్రిప్ట్ మోజో నుంచి వచ్చింది గమనించగలరుBody:AvConclusion:Etv contributer
Sk.meera
Repalle
Guntur jilla
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.