ETV Bharat / state

అపహరణకు గురైన యువతిని కాపాడిన పోలీసులు - Latest information on the kidnapping case of an engineering girl in Pedanandipad

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు వద్ద యువతి అపహరణ కేసుకు సంబంధంచిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడు అశోక్ పై గతంలో అట్రాసిటీ కేసు నమోదై ఉన్నట్లు చెప్పారు. మొత్తంగా ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుని మీడియా ముందు హాజరు పరుస్తామని తెలిపారు.

kidnapped women
యువతిని పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Jul 27, 2021, 5:59 AM IST

యువతిని పట్టుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని అపహరణ కేసు దర్యాప్తులో.. పోలీసులు పురోగతి సాధించారు. యువతిని కాపాడిన పోలీసులు.. పెదనందిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నెల 24 న ఇంటి వద్ద ఉన్న యువతిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు అపహరించారని తెలిపారు.

అశోక్, మరో ఇద్దరితో కలిసి కారులో బలవంతంగా యువతిని తీసుకెళ్లారని చెప్పారు. గుంటూరు మీదుగా హైదరాబాద్ వెళ్లిన నిందితులు.. తిరిగి యువతిని గుంటూరులో వదిలిపెట్టారన్నారు. నిందితుడు అశోక్ పై గతంలో అట్రాసిటీ కేసు నమోదైందని.. ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురినీ త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

యువతిని పట్టుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని అపహరణ కేసు దర్యాప్తులో.. పోలీసులు పురోగతి సాధించారు. యువతిని కాపాడిన పోలీసులు.. పెదనందిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నెల 24 న ఇంటి వద్ద ఉన్న యువతిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు అపహరించారని తెలిపారు.

అశోక్, మరో ఇద్దరితో కలిసి కారులో బలవంతంగా యువతిని తీసుకెళ్లారని చెప్పారు. గుంటూరు మీదుగా హైదరాబాద్ వెళ్లిన నిందితులు.. తిరిగి యువతిని గుంటూరులో వదిలిపెట్టారన్నారు. నిందితుడు అశోక్ పై గతంలో అట్రాసిటీ కేసు నమోదైందని.. ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురినీ త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.