పరిసరాల పరిశుభ్రతలో భాగంగా... ఎన్.సీ.సీ. విద్యార్థులు, 25 బెటాలియన్ ఎన్.సీ.సీ క్యాడేట్లు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని గుంటూరులో నిర్వహించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా వీధులు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ నినాదాలు చేశారు. గుంటూరు పట్టాభిపురం కూడలి నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలను తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు... పరిసరాల పరిశుభ్రతకు శ్రీకారం చుట్టామని 25 బెటాలియన్ ఎన్.సీ.సీ క్యాడేట్ కెప్టెన్ సాంబశివరావు చెప్పారు.
ఇవీ చదవండి...సరిలేరు.. మీకెవ్వరూ..