ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - గుమ్మంపై తాళం తీసుకుంటుండగా విద్యుత్ షాక్​తో నాగులవరంలో వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగులవరంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మరణించాడు. గుమ్మంపైన పెట్టిన తాళం తీసుకునేందుకు ప్రయత్నించగా.. విద్యుత్ ప్రసరిస్తున్న రేకులు అంటుకుని ప్రాణాలు కోల్పోయాడు.

person dead with electric shock at nagulavaram
నాగులవరంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : Feb 21, 2021, 7:06 PM IST

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన.. గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగులవరం శివారు చెంచు కాలనీలో జరిగింది. గన్నెబొయిన పెద రంగయ్య (37) అనే వ్యక్తి.. ఈరోజు తెల్లవారుజామున గుమ్మంపైన పెట్టిన ఇంటి తాళం తీసుకునేందుకు ప్రయత్నించాడు.

ఆ సమయంలో.. ఇంటి రేకుల నుంచి విద్యుత్ ప్రసరిస్తోంది. ఆ విషయం తెలియని రంగయ్య... తాళాలు తీసుకునే యత్నంలో రేకులకు చేతిని తగిలించగానే విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన.. గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగులవరం శివారు చెంచు కాలనీలో జరిగింది. గన్నెబొయిన పెద రంగయ్య (37) అనే వ్యక్తి.. ఈరోజు తెల్లవారుజామున గుమ్మంపైన పెట్టిన ఇంటి తాళం తీసుకునేందుకు ప్రయత్నించాడు.

ఆ సమయంలో.. ఇంటి రేకుల నుంచి విద్యుత్ ప్రసరిస్తోంది. ఆ విషయం తెలియని రంగయ్య... తాళాలు తీసుకునే యత్నంలో రేకులకు చేతిని తగిలించగానే విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

కోటప్పకొండను కొల్లగొట్టిన అక్రమార్కులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.