ETV Bharat / state

శాంతించని కృష్ణమ్మ... ఊళ్లన్నీ కన్నీళ్లే... - flood

కృష్ణా నది ఉగ్రరూపం దాల్చటంతో గుంటూరు జిల్లాలో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వేల ఎకరాల్లోని పంట నీటి పాలైంది. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాధిత ప్రజలు కట్టుబట్టలతో ఊళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అమరావతి
author img

By

Published : Aug 17, 2019, 10:22 AM IST

కృష్ణా నదికి వరద నీరు పోటెత్తటంతో గుంటూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులన్నీ పొంగిపొర్లుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు తాడేపల్లి మండలంలో కరకట్టను కృష్ణా నది వరద తాకుతోంది. ఉద్ధృతికి మండలంలోని 2 వేల ఎకరాల్లో వాణిజ్యపంటలు నీటమునిగాయి.

అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద ఉద్ధృతికి 15 వేల ఎకరాల్లోని పంట నీటమునిగింది. పెద్దమద్దూరు వద్ద వాగు ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. విజయవాడ-అమరావతి మధ్య నాలుగోరోజు రాకపోకలు నిలిచిపోయాయి. మునుగోడు వద్ద నక్కవాగు ఉద్ధృతితో క్రోసూరు-అచ్చంపేట మధ్య రవాణా ఆగింది. అలాగే అమరావతి అమరేశ్వరాలయం వద్ద నదిలోని నీటిమట్టం పెరుగుతోంది. ఆలయం వద్ద ఉన్న పార్కింగ్‌ ప్రదేశానికి వరదనీరు వచ్చిచేరింది. ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మించే ప్రదేశానికి నీరు చేరింది. బెల్లంకొండ మండలం పాపాయపాలెం వద్ద పిల్లేరు వాగు ఉద్ధృతితో మోర్జంపాడు-పాపాయపాలెం మధ్య నిలిచిన రాకపోకలు జరగటం లేదు. అచ్చంపేట మండలం మాదిపాడు... అమరావతి మండలం ధరణికోట, మల్లాది, మునుగోడులో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కొల్లూరు, కొల్లిపొర మండలాల పరిధిలోని 15 గ్రామాల్లోకి వరదనీరు వచ్చింది. అరవిందవారధి వద్ద గండి కారణంగా కృష్ణా కరకట్ట వరకు నీరు చేరింది. లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బందంలో చిక్కున్నాయి. ఇళ్లు వదిలి వచ్చేందుకు లంక గ్రామాల ప్రజల నిరాకరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు నీటమునిగిన కారణంగా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

కృష్ణా నదికి వరద నీరు పోటెత్తటంతో గుంటూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులన్నీ పొంగిపొర్లుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు తాడేపల్లి మండలంలో కరకట్టను కృష్ణా నది వరద తాకుతోంది. ఉద్ధృతికి మండలంలోని 2 వేల ఎకరాల్లో వాణిజ్యపంటలు నీటమునిగాయి.

అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద ఉద్ధృతికి 15 వేల ఎకరాల్లోని పంట నీటమునిగింది. పెద్దమద్దూరు వద్ద వాగు ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. విజయవాడ-అమరావతి మధ్య నాలుగోరోజు రాకపోకలు నిలిచిపోయాయి. మునుగోడు వద్ద నక్కవాగు ఉద్ధృతితో క్రోసూరు-అచ్చంపేట మధ్య రవాణా ఆగింది. అలాగే అమరావతి అమరేశ్వరాలయం వద్ద నదిలోని నీటిమట్టం పెరుగుతోంది. ఆలయం వద్ద ఉన్న పార్కింగ్‌ ప్రదేశానికి వరదనీరు వచ్చిచేరింది. ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మించే ప్రదేశానికి నీరు చేరింది. బెల్లంకొండ మండలం పాపాయపాలెం వద్ద పిల్లేరు వాగు ఉద్ధృతితో మోర్జంపాడు-పాపాయపాలెం మధ్య నిలిచిన రాకపోకలు జరగటం లేదు. అచ్చంపేట మండలం మాదిపాడు... అమరావతి మండలం ధరణికోట, మల్లాది, మునుగోడులో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కొల్లూరు, కొల్లిపొర మండలాల పరిధిలోని 15 గ్రామాల్లోకి వరదనీరు వచ్చింది. అరవిందవారధి వద్ద గండి కారణంగా కృష్ణా కరకట్ట వరకు నీరు చేరింది. లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బందంలో చిక్కున్నాయి. ఇళ్లు వదిలి వచ్చేందుకు లంక గ్రామాల ప్రజల నిరాకరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు నీటమునిగిన కారణంగా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Intro:ap_knl91_16_matti vigrahalapai_avagahana_av_ap10128.... పర్యావరణ హితానికి మట్టి వినాయకుల వినియోగమే మేలని అధ్యాపకులు సూచించారు . జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను ద్వారా వాతావరణం నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లోని విద్యా సాయి విద్యాసంస్థల ఆవరణలో ఇంటర్ డిగ్రీ కళాశాల ల విద్యార్థులకు కు అవగాహన సదస్సు నిర్వహించారు . ఈ సందర్భంగా కళాశాల నిర్వాహకులు వెంకట్ యాదవ్ అధ్యాపకులు మంజుల ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మట్టితో చేసిన విగ్రహాలనే వినియోగించేలా విద్యార్థులు స్థానికుల్లో అవగాహన కల్పించాలని కోరారు . విషపూరితమైన రసాయనాలు కలిగిన రంగులు ఎన్నేళ్లయినా కరగని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి తద్వారా మానవ మనుగడకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు . ఇప్పటికైనా స్థానికులు ప్లాస్టిక్ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిషేధించి మట్టి వినాయకుల విగ్రహాలను ప్రజలకు వివరించాలని కోరారు.


Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.


Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.