ETV Bharat / state

అచ్చెన్నను కలిసేందుకు చంద్రబాబును అనుమతించని అధికారులు - చంద్రబాబుకు అనుమతి నిరాకరణ

ఈఎస్​ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు చేసుకున్న అభ్యర్థనలను జైళ్ల శాఖ అధికారులు తిరస్కరించారు.

no permission
no permission
author img

By

Published : Jun 13, 2020, 3:20 PM IST

Updated : Jun 13, 2020, 3:56 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు.. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు అమరావతి బయల్దేరారు. గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాలని చంద్రబాబు భావించారు. అయితే గుంటూరు వెళ్లేందుకు చంద్రబాబు, లోకేశ్‌కు జైళ్లశాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని అధికారులు తెలిపారు. గత రెండు నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వట్లేదని పేర్కొంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. చంద్రబాబు మరో వినతిపై స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్... మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.

Last Updated : Jun 13, 2020, 3:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.