ETV Bharat / state

Ramya Murder Case: రమ్య ఇంటికి జాతీయ ఎస్సీ కమిషన్ బృందం

author img

By

Published : Aug 24, 2021, 11:05 AM IST

Updated : Aug 24, 2021, 4:41 PM IST

Ramya Murder Case
Ramya Murder Case

11:44 August 24

రమ్య ఇంటికి జాతీయ ఎస్సీ కమిషన్ బృందం

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం గుంటూరులో పర్యటించింది. వీరిలో కమిషన్‌ వైస్ ఛైర్మన్ హల్దార్‌, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి ఉన్నారు. హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను బృంద సభ్యులు కలిశారు. రమ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వినతుల స్వీకరణ..

రమ్య ఇంటి  నుంచి బయల్దేరిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం..  ఆర్‌అండ్‌బీ అతిథిగృహనికి చేరుకున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా  కమిషన్‌ సభ్యులను.. రాజధాని రైతులు కలిశారు. రాజధాని మార్పుతో తమకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఎస్సీ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు.

11:03 August 24

Ramya Murder Case

తెదేపా నేతలు

దాడుల గురించి వివరించాం: తెదేపా

గుంటూరులో రమ్య హత్య ఘటనపై విచారణ కోసం వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ను తెదేపా నేతల బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్‌ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్‌.. కమిషన్‌ అధికారులను విజయవాడలో కలిశారు. ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను వారికి వివరించారు. ఈ ఘటనలపై సవివరంగా వింటామన్న కమిషన్‌.. సాయంత్రం 5.30 గంటలకు తెదేపా నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు.

'జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌, సభ్యులను ఒక్క నిమిషమే కలిశాం. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడుల వివరాల బుక్‌లెట్‌ చూపించాం. సాయంత్రం 5.30 గంటలకు రమ్మని మాకు చెప్పారు. సాయంత్రం సీఎం, గవర్నర్ వస్తారని.. అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఎస్సీ కమిషన్‌ను కలవకుండా అధికారులు పక్కదారి పట్టించారు' - తెదేపా నేతల బృందం

అనుబంధ కథనాలు

11:44 August 24

రమ్య ఇంటికి జాతీయ ఎస్సీ కమిషన్ బృందం

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం గుంటూరులో పర్యటించింది. వీరిలో కమిషన్‌ వైస్ ఛైర్మన్ హల్దార్‌, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి ఉన్నారు. హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను బృంద సభ్యులు కలిశారు. రమ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వినతుల స్వీకరణ..

రమ్య ఇంటి  నుంచి బయల్దేరిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం..  ఆర్‌అండ్‌బీ అతిథిగృహనికి చేరుకున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా  కమిషన్‌ సభ్యులను.. రాజధాని రైతులు కలిశారు. రాజధాని మార్పుతో తమకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఎస్సీ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు.

11:03 August 24

Ramya Murder Case

తెదేపా నేతలు

దాడుల గురించి వివరించాం: తెదేపా

గుంటూరులో రమ్య హత్య ఘటనపై విచారణ కోసం వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ను తెదేపా నేతల బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్‌ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్‌.. కమిషన్‌ అధికారులను విజయవాడలో కలిశారు. ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను వారికి వివరించారు. ఈ ఘటనలపై సవివరంగా వింటామన్న కమిషన్‌.. సాయంత్రం 5.30 గంటలకు తెదేపా నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు.

'జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌, సభ్యులను ఒక్క నిమిషమే కలిశాం. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడుల వివరాల బుక్‌లెట్‌ చూపించాం. సాయంత్రం 5.30 గంటలకు రమ్మని మాకు చెప్పారు. సాయంత్రం సీఎం, గవర్నర్ వస్తారని.. అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఎస్సీ కమిషన్‌ను కలవకుండా అధికారులు పక్కదారి పట్టించారు' - తెదేపా నేతల బృందం

అనుబంధ కథనాలు

Last Updated : Aug 24, 2021, 4:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.