ETV Bharat / state

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి - ఏపీ తాజా వార్తలు

అటవీ సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి ప్రతీప్ కుమార్ అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

National Forest Martyrs Day
National Forest Martyrs Day
author img

By

Published : Sep 11, 2021, 5:01 PM IST

అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి ప్రతీప్ కుమార్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గుంటూరు అటవీ శాఖ కార్యాలయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 22 మంది అమరువీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇందుకోసం స్పెషల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి

అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి ప్రతీప్ కుమార్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గుంటూరు అటవీ శాఖ కార్యాలయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 22 మంది అమరువీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇందుకోసం స్పెషల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి

CM Jagan: వారంలో బాషా సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.