ETV Bharat / state

'వైకాపా విలేజ్ క్లినిక్​లతో ఆర్​ఎంపీల పొట్టకొట్టాలని చూస్తోంది' - Chadalwada Aravinda Babu comments on village clinics

గత ఆరు నెలలుగా కరోనా సమయంలో ప్రాణాలు అడ్డుపెట్టి గ్రామాల్లో ఆర్ఎంపీలు వైద్య సేవలు అందించారని నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు గుర్తుచేశారు. ప్రభుత్వం విలేజ్ క్లినిక్​లను ప్రోత్సహిస్తే ఆర్ఎంపీలు రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుందన్నారు. అలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వం ఆర్ఎంపీ లకు అండగా నిలవాలని కోరారు.

Chadalwada Aravinda Babu comments on village clinics
నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు
author img

By

Published : Jan 10, 2021, 3:19 PM IST

ఆర్ఎంపీలను ప్రభుత్వం ఆదుకోవాలని నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు. వైకాపా ప్రభుత్వం త్వరలో విలేజ్ క్లినిక్​లను ప్రవేశపెట్టి ఆర్ఎంపీల పొట్టకొట్టాలని చూస్తోందని నరసరావుపేట తెదేపా కార్యాలయంలో ఆరోపించారు. తరతరాల నుంచి గ్రామాలను నమ్ముకొని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఆర్ఎంపీలు వైద్యవృత్తిలో కొనసాగుతున్నారన్నారు. వారందరికీ అన్యాయం జరిగేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం విలేజ్ క్లినిక్​ల ఆలోచన చేయడం సరికాదని అరవిందబాబు పేర్కొన్నారు.

అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉండేదన్న ఆయన.. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని నిలిపివేసిందన్నారు. అందువల్ల పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని.. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ఈ విషయాన్ని గుర్తించి ఆరోగ్యశ్రీలో మోకాళ్ళ ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని అరవింద బాబు కోరారు.

ఆర్ఎంపీలను ప్రభుత్వం ఆదుకోవాలని నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు. వైకాపా ప్రభుత్వం త్వరలో విలేజ్ క్లినిక్​లను ప్రవేశపెట్టి ఆర్ఎంపీల పొట్టకొట్టాలని చూస్తోందని నరసరావుపేట తెదేపా కార్యాలయంలో ఆరోపించారు. తరతరాల నుంచి గ్రామాలను నమ్ముకొని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఆర్ఎంపీలు వైద్యవృత్తిలో కొనసాగుతున్నారన్నారు. వారందరికీ అన్యాయం జరిగేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం విలేజ్ క్లినిక్​ల ఆలోచన చేయడం సరికాదని అరవిందబాబు పేర్కొన్నారు.

అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉండేదన్న ఆయన.. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని నిలిపివేసిందన్నారు. అందువల్ల పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని.. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ఈ విషయాన్ని గుర్తించి ఆరోగ్యశ్రీలో మోకాళ్ళ ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని అరవింద బాబు కోరారు.

ఇవీ చూడండి...: జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.