స్వార్థ రాజకీయాల కోసం వైకాపా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాష్ట్రంలో ఏ దురదృష్టకరమైన ఘటన జరిగినా తెదేపా నేతలు.. వైకాపాపై రుద్దడం ఆనవాయితీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
చాలా మంది అర్హులలైన అభ్యర్థులకు ఇళ్ల స్థలాలు రాకపోవడంపై మహిళలు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ.. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు వచ్చేలా చూస్తామని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్ష నేతలు ప్రయత్నించడం బాధాకరమని మోపిదేవి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు