ETV Bharat / state

కలాం విజన్ యాత్రకు ఎమ్మెల్యే సంఘీభావం - చిలకలూరిపేట తాజా వార్తలు

తమిళనాడులోని రామేశ్వరం నుంచి ప్రారంభమైన కలాం విజన్ యాత్ర నాలుగు రాష్ట్రాల మీదుగా కొనసాగుతూ.. చిలకలూరిపేటకు చేరుకుంది. కలాం విజన్ యాత్రకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని సంఘీభావం తెలిపారు.

పోస్టర్​ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే
పోస్టర్​ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Nov 11, 2020, 9:59 PM IST

అక్టోబర్ 15న అబ్దుల్ కలాం స్వస్థలమైన రామేశ్వరం నుంచి ప్రారంభమైన కలాం విజన్ యాత్ర నాలుగు రాష్ట్రాల మీదుగా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు చేరుకుంది. దేశ అభివృద్దిని కాంక్షిస్తూ యువతను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఈ యాత్రను చేపట్టినట్లు వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ తెలిపింది. కలాం విజన్ యాత్రకు ఎమ్మెల్యే విడదల రజని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశ యువతకు ఇచ్చిన సందేశం.. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అనే విషయాన్ని నేటి యువత గుర్తించాలని ఆమె అన్నారు. అనంతరం కలాం విజన్ యాత్ర పోస్టర్​ను ఆవిష్కరించారు. కలాం విజన్ యాత్రకు నాయకత్వం వహిస్తున్న సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం, రెండు తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్​లు... తాటిపల్లి సుధీర్, రవిరాజ్, సంస్థ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్ 15న అబ్దుల్ కలాం స్వస్థలమైన రామేశ్వరం నుంచి ప్రారంభమైన కలాం విజన్ యాత్ర నాలుగు రాష్ట్రాల మీదుగా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు చేరుకుంది. దేశ అభివృద్దిని కాంక్షిస్తూ యువతను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఈ యాత్రను చేపట్టినట్లు వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ తెలిపింది. కలాం విజన్ యాత్రకు ఎమ్మెల్యే విడదల రజని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశ యువతకు ఇచ్చిన సందేశం.. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అనే విషయాన్ని నేటి యువత గుర్తించాలని ఆమె అన్నారు. అనంతరం కలాం విజన్ యాత్ర పోస్టర్​ను ఆవిష్కరించారు. కలాం విజన్ యాత్రకు నాయకత్వం వహిస్తున్న సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం, రెండు తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్​లు... తాటిపల్లి సుధీర్, రవిరాజ్, సంస్థ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

డీఆర్​వోగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.