ETV Bharat / state

'అర్హులై ఉండి.. ఇళ్ల పట్టాలు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోండి' - పేదలకు నరసరావుపేటలో ఇళ్లపట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

వైకాపా ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ చేశారు.

MLA Gopireddy Srinivasareddy distributed houses
పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
author img

By

Published : Jan 7, 2021, 2:01 PM IST

నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో 432 మందికి, రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామంలో 158 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అర్హులై ఉండి ఇళ్లపట్టాలు రానివారు ఎవరైనా ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని.. వారందరికీ రెండో దశలో ఇళ్లపట్టాలు అందజేస్తామని చెప్పారు.

నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో 432 మందికి, రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామంలో 158 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అర్హులై ఉండి ఇళ్లపట్టాలు రానివారు ఎవరైనా ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని.. వారందరికీ రెండో దశలో ఇళ్లపట్టాలు అందజేస్తామని చెప్పారు.

ఇవీ చూడండి:

చూపు లేకపోతేనేం... మంచి మనసుంది...!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.