ETV Bharat / state

అత్యాచారానికి గురైన బాలికకు.. ఆమె తల్లికి కరోనా

author img

By

Published : Jun 25, 2020, 5:10 AM IST

తండ్రి చేతిలో అత్యాచారానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు కరోనా సోకింది. బాధితురాలి తల్లికి కూడా వైరస్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారు గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు.

corona
corona

గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఈ నెల7న తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన బాలికకు, ఆమె తల్లికి కరోనా పాజిటివ్​గా తేలింది. బాలిక ఈ నెల 8న గుంటూరు జీజీహెచ్​లోని జనరల్​ మెడిసిన్ విభాగంలో చికిత్స కోసం చేరింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న బాలికకు తల్లి సహాయకురాలిగా ఉంది. కరోనా అనుమానంతో వారికి 3 రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికీ కరోనా ఉన్నట్లు తేలటంతో ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుకు తరలించారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఈ నెల7న తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన బాలికకు, ఆమె తల్లికి కరోనా పాజిటివ్​గా తేలింది. బాలిక ఈ నెల 8న గుంటూరు జీజీహెచ్​లోని జనరల్​ మెడిసిన్ విభాగంలో చికిత్స కోసం చేరింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న బాలికకు తల్లి సహాయకురాలిగా ఉంది. కరోనా అనుమానంతో వారికి 3 రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికీ కరోనా ఉన్నట్లు తేలటంతో ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.