ETV Bharat / state

క్వారంటైన్​కు తరలించడంపై వలస కూలీల ఆందోళన - గుంటూరు జిల్లా వార్తలు

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన కార్మికులు తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. వందల కిలోమీటర్లు నడుస్తూ పయనాన్ని కొనసాగిస్తున్నారు. అలా నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళానికి వస్తున్న కూలీలను గుంటూరు జిల్లా నల్లపాడులో పోలీసులు అడ్డుకున్నారు.

Migrant labor agitation over evacuation of Quarantine Center in guntur district
క్వారంటైన్ కేంద్రానికి తరలింపుపై వలస కూలీల ఆందోళన
author img

By

Published : Apr 30, 2020, 3:16 PM IST

ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లిన వారు లాక్​డౌన్​తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ తినేందుకు తిండిలేక చేసేందుకు పనిలేక కాలినడకన సొంతూళ్లకు పయనమవుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఉపాధి కోసం నెల్లూరు వెళ్లిన కార్మికులు లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి తిరిగి స్వస్థలాలకు పయనమయ్యారు. అలా కాలినడకన గుంటూరు చేరిన వీరిని నల్లపాడులో పోలీసులు అడ్డుకుని.. క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు. దీనిపై కూలీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి తమను స్వస్థలాలకు పంపించాలని కోరారు.

ఇదీ చదవండి..

ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లిన వారు లాక్​డౌన్​తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ తినేందుకు తిండిలేక చేసేందుకు పనిలేక కాలినడకన సొంతూళ్లకు పయనమవుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఉపాధి కోసం నెల్లూరు వెళ్లిన కార్మికులు లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి తిరిగి స్వస్థలాలకు పయనమయ్యారు. అలా కాలినడకన గుంటూరు చేరిన వీరిని నల్లపాడులో పోలీసులు అడ్డుకుని.. క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు. దీనిపై కూలీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి తమను స్వస్థలాలకు పంపించాలని కోరారు.

ఇదీ చదవండి..

జిల్లాలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.