ETV Bharat / state

కృష్ణా నది వరద ఉద్ధృతికి వ్యక్తి గల్లంతు

author img

By

Published : Oct 17, 2020, 5:54 PM IST

కృష్ణా నది వరద ఉద్ధృతికి కొల్లూరు మండలంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కొల్లూరు నుంచి తన స్వగ్రామమైన ఆవులవారిపాలేనికి వెళ్తున్న సమయంలో వరదను దాటే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయాడు.

man missing in flood in krishna river
కృష్ణా నది వరదలో పడి వ్యక్తి గల్లంతు

కొల్లూరు మండలంలో వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆవులవారిపాలేనికి చెందిన సనక శంకర్రావు... శుక్రవారం ఉదయం కృష్ణా నది వరదలో కొట్టుకుపోయాడు. కొల్లూరు నుంచి తమ గ్రామానికి వెళ్తున్న సమయంలో వరద దాటేందుకు యత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు కాలు జారటం వల్ల నీటి ప్రవాహంలో పడిపోయాడు.

స్థానికులు శంకర్రావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వరద తీవ్రంగా ఉన్న సమయంలో కనీసం రెస్క్యూ బోట్లు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక గ్రామాలకు వెళ్లే మార్గంలో అత్యవసర సేవలు అందుబాటులో లేవని మండిపడ్డారు.

కొల్లూరు మండలంలో వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆవులవారిపాలేనికి చెందిన సనక శంకర్రావు... శుక్రవారం ఉదయం కృష్ణా నది వరదలో కొట్టుకుపోయాడు. కొల్లూరు నుంచి తమ గ్రామానికి వెళ్తున్న సమయంలో వరద దాటేందుకు యత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు కాలు జారటం వల్ల నీటి ప్రవాహంలో పడిపోయాడు.

స్థానికులు శంకర్రావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వరద తీవ్రంగా ఉన్న సమయంలో కనీసం రెస్క్యూ బోట్లు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక గ్రామాలకు వెళ్లే మార్గంలో అత్యవసర సేవలు అందుబాటులో లేవని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

పశువుల కోసం చెరువు దాటుతూ వ్యక్తి గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.