ETV Bharat / state

నిడబ్రోలులో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య - man makes suicide attempt falling under train

కర్నూలు జిల్లా మహానంది మండలం పుట్టపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి చక్రపాణి అనే యువకుడు... గుంటూరు జిల్లా నిడబ్రోలు రైల్వేస్టేషన్​లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

man makes suicide attempt falling under train in guntur district
నిడబ్రోలులో రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
author img

By

Published : Oct 10, 2020, 11:28 PM IST


కర్నూలు జిల్లా మహానంది మండలం పుట్టపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి చక్రపాణి అనే యువకుడు... గుంటూరు జిల్లా నిడబ్రోలు రైల్వేస్టేషన్​లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

2009 సంవత్సరంలో ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసిన వాల్మీకి... ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం కోసం అనేక పరీక్షలకు హాజరయ్యారు. నిరుపేద కుటుంబం కావడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తటం, ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు ఆ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలంలో ఓ బ్యాంకుకు సంబంధించి... విరిగిపోయిన ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా కేసు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

కర్నూలు జిల్లా ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉన్నట్టు పోలీసులు సమాచారం సేకరించారు. బ్యాంకుకు వెళ్లి విచారించగా కర్నూలు జిల్లా పుట్టపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి చక్రపాణిగా గుర్తించి కుటుంబసభ్యులు తెలిపగా... వారంతా తెనాలి వచ్చి మృతదేహాన్ని చూసి గుర్తించినట్లు రైల్వే ఎస్సై వెంకటాద్రి తెలిపారు.


కర్నూలు జిల్లా మహానంది మండలం పుట్టపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి చక్రపాణి అనే యువకుడు... గుంటూరు జిల్లా నిడబ్రోలు రైల్వేస్టేషన్​లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

2009 సంవత్సరంలో ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసిన వాల్మీకి... ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం కోసం అనేక పరీక్షలకు హాజరయ్యారు. నిరుపేద కుటుంబం కావడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తటం, ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు ఆ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలంలో ఓ బ్యాంకుకు సంబంధించి... విరిగిపోయిన ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా కేసు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

కర్నూలు జిల్లా ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉన్నట్టు పోలీసులు సమాచారం సేకరించారు. బ్యాంకుకు వెళ్లి విచారించగా కర్నూలు జిల్లా పుట్టపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి చక్రపాణిగా గుర్తించి కుటుంబసభ్యులు తెలిపగా... వారంతా తెనాలి వచ్చి మృతదేహాన్ని చూసి గుర్తించినట్లు రైల్వే ఎస్సై వెంకటాద్రి తెలిపారు.

ఇదీ చదవండి:

రైతుల గుండెలు ఆగుతున్నా జగన్ మనసు కరగటం లేదు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.