ETV Bharat / state

రేపల్లె పట్టణంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

author img

By

Published : Mar 3, 2021, 9:08 AM IST

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చనిపోయాడు. ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా.. సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు.

Man dies of electric shock in the town of Repalle
రేపల్లె పట్టణంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన విద్యుత్తు కార్మికుడు ఆరీఫ్ బాష విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. 24వ వార్డులోని ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్​కు గురయ్యాడు. సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చాణిక్య తెలిపారు.

గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన విద్యుత్తు కార్మికుడు ఆరీఫ్ బాష విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. 24వ వార్డులోని ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్​కు గురయ్యాడు. సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చాణిక్య తెలిపారు.

ఇదీ చదవండి:

వైకాపాకు ఓటేస్తే సుంకాల మోత: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.