గుంటూరు జిల్లా శ్యామలానగర్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శ్యామలానగర్ 2, 10వ లైన్లలో శునకాల దాడిలో 8 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన చిన్నారులను పట్టాభిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెలలో ఇది రెండవ ఘటన కావటంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని తమను కుక్కల బారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: