ETV Bharat / state

"రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది: నారా లోకేశ్"

ఇసుక కొరతను నిరసిస్తూ మంగళగిరిలో తెదేపా నాయకులు చేస్తున్న ధర్నాలో లోకేశ్ పాల్గొన్నారు.

ఇసుక ధర్నాలో పాల్గొన్న లోకేశ్
author img

By

Published : Aug 30, 2019, 10:38 AM IST

Updated : Aug 30, 2019, 11:03 AM IST

ఇసుక ధర్నాలో పాల్గొన్న లోకేశ్

రాష్ట్రంలో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన కార్మికలకు మద్దతుగా, తెదేపా నేతలు మంగళగిరిలో ధర్నా ఏర్పాటు చేశారు. ఈ ధర్నాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్ వద్ద మూసివేసిన అన్న క్యాంటీన్ వద్ద బైఠాయించిన తెదేపా నేతలు ముఖ్యమంత్రిని విమర్శిస్తూ , పేదల రాజ్యాన్ని పులివెందుల రాజ్యం చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని లోకేశ్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. . ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందంటూ ధ్వజమెత్తారు. కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలల అయితే రాష్ట్రం మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇసుక ధరలు పెరిగిపోయాయని అన్నారు. అవినీతి పుత్రుడు, తండ్రిని అడ్డుపెట్టుకొని దేశాన్ని దోచేసిన ఆయన ఇప్పుడు ఇసుకను తింటున్నారంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిపై రోజుకొక మాట మారుస్తున్నారనీ, భవన నిర్మాణ కార్మికులు, ఇసుక పై ఆధారపడి బతుకుతున్న వారు రోడ్డు పై పడ్డారని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవటానికి ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమా, పేదలకు అక్షయ పాత్ర అయిన అన్న క్యాంటీన్లను ఆపేసారని వివరించారు. 8 లక్షల భవన నిర్మాణ కార్మికులందరకీ అరవై వేల రూపాయలిచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 'తోపులాటలో రైతుల మృతిపై ప్రభుత్వానిదే బాధ్యత'

ఇసుక ధర్నాలో పాల్గొన్న లోకేశ్

రాష్ట్రంలో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన కార్మికలకు మద్దతుగా, తెదేపా నేతలు మంగళగిరిలో ధర్నా ఏర్పాటు చేశారు. ఈ ధర్నాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్ వద్ద మూసివేసిన అన్న క్యాంటీన్ వద్ద బైఠాయించిన తెదేపా నేతలు ముఖ్యమంత్రిని విమర్శిస్తూ , పేదల రాజ్యాన్ని పులివెందుల రాజ్యం చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని లోకేశ్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. . ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందంటూ ధ్వజమెత్తారు. కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలల అయితే రాష్ట్రం మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇసుక ధరలు పెరిగిపోయాయని అన్నారు. అవినీతి పుత్రుడు, తండ్రిని అడ్డుపెట్టుకొని దేశాన్ని దోచేసిన ఆయన ఇప్పుడు ఇసుకను తింటున్నారంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధానిపై రోజుకొక మాట మారుస్తున్నారనీ, భవన నిర్మాణ కార్మికులు, ఇసుక పై ఆధారపడి బతుకుతున్న వారు రోడ్డు పై పడ్డారని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవటానికి ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమా, పేదలకు అక్షయ పాత్ర అయిన అన్న క్యాంటీన్లను ఆపేసారని వివరించారు. 8 లక్షల భవన నిర్మాణ కార్మికులందరకీ అరవై వేల రూపాయలిచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 'తోపులాటలో రైతుల మృతిపై ప్రభుత్వానిదే బాధ్యత'

Intro: mother చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎన్నికల నిర్వహణలో ఎదురైన సమస్యలు


Body:మొరాయించి నా ఈవీఎం


Conclusion:ఓటుహక్కు వినియోగించుకోడానికి ఓటర్లు ఏడు గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు కానీ నీ చాలా కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల తరబడి వేచి ఉన్నారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఎనిమిదిన్నరకు ప్రారంభం కాకపోవడంతో ఓటర్లు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలో మొరాయించాయి దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు మదనపల్లె పట్టణంలోని 178 17 181 7 ఎంపీడీవో కార్యాలయం బీటీ కళాశాల లోని ఈవీఎంలు మొరాయించాయి వీటిని మరమ్మత్తు చేసి ఇ యధావిధిగా పోలింగ్ నిర్వహించడానికి అధికారులు వ్యక్తం చేస్తున్నారు ఎనిమిది గంటల 30 నిమిషాల వరకు కూడా ఈవీఎంలో లో పని చేయకపోవడంతో హోటల్ లో వరుసలో నిలబడ్డారు అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తీసుకోవాలి కోరుతున్నారు బై టూ లు
Last Updated : Aug 30, 2019, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.