ETV Bharat / state

4,656 మద్యం సీసాలు స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్ - నకరికల్లు అక్రమ మద్యం వార్తలు

తెలంగాణ నుంచి చిలకలూరిపేటకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా నకరికల్లు ఏకలవ్య విగ్రహం వద్ద అధికారులు తనిఖీలు చేపట్టి... వాహనాల అడుగు భాగంలో దాచి తరలిస్తున్న 4,656 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు వాహనాలను సీజ్ చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు.

liquor seized
మద్యం సీసాలు స్వాధీనం.
author img

By

Published : Feb 25, 2021, 12:24 PM IST

Updated : Feb 25, 2021, 4:16 PM IST

ఆటోకింద ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేసి..

గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేంద్రంగా సాగుతున్న అక్రమ మద్యం వ్యాపారం గుట్టురట్టైంది. నకరికల్లు వద్ద అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో.. సుమారు 11 లక్షలు విలువైన తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 వేల 656 తెలంగాణ మద్యం సీసాలు లభ్యమైనట్లు.. తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేయగా ఎనిమిది మంది పరారైనట్లు తెలిపారు. తెలంగాణ నుంచి చిలకలూరిపేటకు తెప్పించి.. అక్కడి నుంచి బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు తేలిందని అబ్కారీ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: అభివృద్ధి చేసే ఆలోచన ఉంటే.. రెండు సంవత్సరాల క్రితమే చేసేవారు..

ఆటోకింద ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేసి..

గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేంద్రంగా సాగుతున్న అక్రమ మద్యం వ్యాపారం గుట్టురట్టైంది. నకరికల్లు వద్ద అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో.. సుమారు 11 లక్షలు విలువైన తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 వేల 656 తెలంగాణ మద్యం సీసాలు లభ్యమైనట్లు.. తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేయగా ఎనిమిది మంది పరారైనట్లు తెలిపారు. తెలంగాణ నుంచి చిలకలూరిపేటకు తెప్పించి.. అక్కడి నుంచి బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు తేలిందని అబ్కారీ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: అభివృద్ధి చేసే ఆలోచన ఉంటే.. రెండు సంవత్సరాల క్రితమే చేసేవారు..

Last Updated : Feb 25, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.