ETV Bharat / state

ముంపు బారిన పల్లెలు.. ముమ్మరంగా సహాయక చర్యలు

author img

By

Published : Sep 28, 2020, 11:04 PM IST

పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు విడుదల అవుతుండటంతో గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలో బాధితులకు అన్ని రకాల సహాయకచర్యలు చేపట్టాలని పోలీసులు, అధికారులను ఎస్పీ ఆదేశించారు.

krishna river flods in guntur district
ముంపుగ్రామాల్లో పోలీసుల సహాయక చర్యలు

కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం, అచ్చంపేట, తుళ్లూరు, కొల్లిపర, కొల్లూరు, రేపల్లె పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఫలితంగా స్థానిక పోలీసులు, అధికారులను.. గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని అప్రమత్తం చేశారు.

ఇందులో భాగంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ముంపు గ్రామాల్లో ప్రత్యేక బృందాలను పంపించారు. వారికి రక్షణ పరికరాలు అందించారు. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు వచ్చిన ప్రదేశాల్లో పోలీసు సిబ్బందిని నియమించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం, అచ్చంపేట, తుళ్లూరు, కొల్లిపర, కొల్లూరు, రేపల్లె పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఫలితంగా స్థానిక పోలీసులు, అధికారులను.. గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని అప్రమత్తం చేశారు.

ఇందులో భాగంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ముంపు గ్రామాల్లో ప్రత్యేక బృందాలను పంపించారు. వారికి రక్షణ పరికరాలు అందించారు. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు వచ్చిన ప్రదేశాల్లో పోలీసు సిబ్బందిని నియమించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

ఇదీ చదవండి:

'పర్యావరణానికి ముప్పు వాటిల్లితే.. అంతా స్పందించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.