ETV Bharat / state

జీజీహెచ్​లో కిడ్నీ శస్త్రచికిత్సలు పునఃప్రారంభమెప్పుడు? - LATEST GGH KIDNEY OPERATIONS

గుంటూరు సర్వజనాస్పత్రిలో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆరు నెలలుగా ఆపరేషన్లు నిలిచిపోవడంతో పేదలకు అరుదైన వైద్యసదుపాయం దూరమైంది. సాంకేతిక సమస్యలే కారణమని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు.

జీజీహెచ్​లో కిడ్నీ శస్త్రచికిత్సలు పునఃప్రారంభమెప్పుడు?
జీజీహెచ్​లో కిడ్నీ శస్త్రచికిత్సలు పునఃప్రారంభమెప్పుడు?
author img

By

Published : Dec 13, 2019, 10:19 AM IST

ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలతో ఖర్చయ్యే కిడ్నీ మార్పిడి శస్తచికిత్సలు జీజీహెచ్​లో 2016 నుంచి చేసేవారు.ఇప్పటివరకు ఇరవై ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. కానీ ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్​లలో సరైన సదుపాయాలు లేక ఆరు నెలలుగా మూత్రపిండాల శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఈ సమస్యపై ఇటీవల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్యాలయ సమావేశంలో... రోగులు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ థియేటర్లు కేటాయించాలని కోరారు. సర్జరీ తర్వాత రోగికి చికిత్స అందించేలా ఐసోలేషన్ వార్డును కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆపరేషన్లు చేయడానికి తాము సిద్ధమేనని.... సదుపాయాలు సమకూరితే మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలను మళ్లీ పునరుద్ధరిస్తామని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. రోగుల ఇబ్బందుల దృష్ట్యా ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జీజీహెచ్​లో కిడ్నీ శస్త్రచికిత్సలు పునఃప్రారంభమెప్పుడు?

ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలతో ఖర్చయ్యే కిడ్నీ మార్పిడి శస్తచికిత్సలు జీజీహెచ్​లో 2016 నుంచి చేసేవారు.ఇప్పటివరకు ఇరవై ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. కానీ ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్​లలో సరైన సదుపాయాలు లేక ఆరు నెలలుగా మూత్రపిండాల శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఈ సమస్యపై ఇటీవల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్యాలయ సమావేశంలో... రోగులు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ థియేటర్లు కేటాయించాలని కోరారు. సర్జరీ తర్వాత రోగికి చికిత్స అందించేలా ఐసోలేషన్ వార్డును కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆపరేషన్లు చేయడానికి తాము సిద్ధమేనని.... సదుపాయాలు సమకూరితే మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలను మళ్లీ పునరుద్ధరిస్తామని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. రోగుల ఇబ్బందుల దృష్ట్యా ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జీజీహెచ్​లో కిడ్నీ శస్త్రచికిత్సలు పునఃప్రారంభమెప్పుడు?

ఇవీ చదవండి

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. కిడ్నీ బాధితులతో అధికారుల సమావేశం

AP_GNT_01_12_KIDNEY_TRANSPLANTATION_OPERATIONS_STOPPED_IN_GGH_AVB_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: KESAVA RAO ( ) గుంటూరు సర్వజనాస్పత్రిలో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆరు నెలలుగా ఆపరేషన్లు నిలిచిపోవడంతో పేదలకు అరుదైన వైద్యసదుపాయం దూరమైంది. సాంకేతిక సమస్యలే కారణమని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు....LOOK..... V.O.: ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయల ఖర్చయ్యే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను జీజీహెచ్ లో ఉచితంగా నిర్వహించేవారు. 2016 నుంచి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను జీజీహెచ్ లో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు 20 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను ఇక్కడి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కిడ్నీలు ఏమాత్రం పనిచేయక......దినదినగండంగా బతికే రోగులకు కిడ్నీమార్పిడి శస్త్రచికిత్స అత్యవసరం. మార్పిడి అవసరమైనప్పటికీ విధి లేని పరిస్థితిలో కొందరు రోగులు డయాలసిస్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఆపరేషన్ సదుపాయం లేక పొరుగుసేవల సంస్థ నిర్వహించే డయాలసిస్ యూనిట్ కు పంపిస్తున్నారు. ప్రత్యేకించి ఆపరేషన్ థియేటర్, ఐసోలేషన్ పోస్టు ఆపరేటివ్ వార్డు వంటి సదుపాయాలు లేనందున జీజీహెచ్ లో సమస్య తలెత్తింది. ఇటీవల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలోనూ రోగులు ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు మిలీనియం బ్లాకులో కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగంలో ఆపరేషన్ థియేటర్లు కేటాయించాలని, సర్జరీ తర్వాత రోగికి చికిత్స అందించేలా ఐసోలేషన్ వార్డును కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆపరేషన్లు చేయడానికి తాము సిద్ధమేనని.... సదుపాయాలు సమకూరితే మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు....BYTE.... BYTE: డాక్టర్ శివరామకృష్ణ, నెప్రాలజిస్టు, జీజీహెచ్ E.V.O.: రోగుల ఇబ్బందుల దృష్ట్యా జీజీహెచ్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసముంది.....END.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.