ETV Bharat / state

పిడుగురాళ్లలో అమ్మవారి నగలు మాయం!

author img

By

Published : Oct 26, 2020, 2:34 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారి మెడలో వేసే బంగారు గోలుసులు మాయమయ్యాయి. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

పిడుగురాళ్లలో అమ్మవారి నగలు మాయం!
పిడుగురాళ్లలో అమ్మవారి నగలు మాయం!


గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి మెడలో వేసే రెండు బంగారు గొలుసులు మాయమైనట్లు సమాచారం. గురువారం రాత్రి అమ్మ వారిని అలంకరించడం కోసం అమ్మవారి మెడలో ఉన్నటువంటి రెండు నగలు తీసి కవర్లో పెట్టారు. పూలతో అలంకరించిన తర్వాత గొలుసులు వేయడానికి చూస్తే ఆభరణాలు కనిపించలేదు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినట్లు తెలిసింది. నగల విలువ పది లక్షల వరకు ఉంటుందని సమాచారం. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి మెడలో వేసే రెండు బంగారు గొలుసులు మాయమైనట్లు సమాచారం. గురువారం రాత్రి అమ్మ వారిని అలంకరించడం కోసం అమ్మవారి మెడలో ఉన్నటువంటి రెండు నగలు తీసి కవర్లో పెట్టారు. పూలతో అలంకరించిన తర్వాత గొలుసులు వేయడానికి చూస్తే ఆభరణాలు కనిపించలేదు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినట్లు తెలిసింది. నగల విలువ పది లక్షల వరకు ఉంటుందని సమాచారం. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

ప్రాణం తీసిన తాడు... ద్విచక్ర వాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.