ETV Bharat / state

Irregularities in Guntur Rythu Bharosa Centre: రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది చేతివాటం.. ఒకరి అరెస్టు - ప్రత్తిపాడు రైతు భరోసా కేంద్రాలలో ఉద్యాన శాఖసిబ్బంది అక్రమాలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది.. చేతివాటం (Irregularities in guntur Rythu bharosa centre) ప్రదర్శించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో తొమ్మిది రైతు భరోసా కేంద్రాల్లో అనుమతులు లేని వేప నూనె సీసాలను రైతులకు విక్రయించారు.

Irregularities of Agriculture and Horticulture Department staff in rythu bharosa Center in prathipadu at guntur
రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది అక్రమాలు
author img

By

Published : Nov 26, 2021, 7:08 PM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది అక్రమాలకు(Irregularities in guntur Rythu bharosa centre) తెరలేపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో(prathipadu Rythu bharosa centre) తొమ్మిది రైతు భరోసా కేంద్రాల్లో అనుమతులు లేని వేప నూనె సీసాలను రైతులకు విక్రయించారు. మిరప పంటలో వచ్చిన తామర పురుగు, వైరస్ నివారణకు వేప నూనె పిచికారీ చేయాలనే శాత్రవేత్తల సూచనను ఆర్బికేల సిబ్బంది అక్రమార్జనకు మార్గంగా మలుచుకున్నారు.

గుంటూరులో అనుమతులు లేకుండా వేపనూనె తయారు చేస్తున్న శివనాగేశ్వరరావుతో ఒప్పందం కుదుర్చుకుని.. ఆ నూనె బాటిళ్లను పెద్ద ఎత్తున తీసుకువచ్చి రైతులకు విక్రయించారు. ఒక్కొక్క బాటిల్​పై రూ.300 నుంచి 500 వందల వరకు లాభం చూసుకుని రైతులకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాటిల్ అసలు ధర రూ.999 గా ఉందని.. కానీ ప్రభుత్వం రాయితీ ఇచ్చినందువల్ల రూ.600 వరకు ఇస్తున్నామని చెప్పి, విక్రయించారు. తెలంగాణలోని వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లాలోని ఎస్వీ ఆర్గానిక్స్ సంస్థ లేబుల్ తో డబ్బాలను ప్యాకింగ్ చేశారు.

వ్యవసాయ అధికారుల విచారణ..
ఈ విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ జేడీఏలు శ్రీధర్, కృపాదాస్, గుంటూరు జేడీఏ విజయభారతి.. ప్రత్తిపాడు చేరుకుని విచారణ చేపట్టారు. రైతు భరోసా కేంద్రాలలోని వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ సిబ్బందిని, రైతులను విచారించారు. గుంటూరులో అనుమతులు లేకుండా వేప నూనె తయారు చేస్తున్న కేంద్రంపై దాడులు చేసి తయాడిదారుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆర్బీకేలలో పని చేస్తున్న సిబ్బంది.. ప్రవేట్ వ్యాపారం చేయడం తప్పు అని.. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్తి విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది అక్రమాలకు(Irregularities in guntur Rythu bharosa centre) తెరలేపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో(prathipadu Rythu bharosa centre) తొమ్మిది రైతు భరోసా కేంద్రాల్లో అనుమతులు లేని వేప నూనె సీసాలను రైతులకు విక్రయించారు. మిరప పంటలో వచ్చిన తామర పురుగు, వైరస్ నివారణకు వేప నూనె పిచికారీ చేయాలనే శాత్రవేత్తల సూచనను ఆర్బికేల సిబ్బంది అక్రమార్జనకు మార్గంగా మలుచుకున్నారు.

గుంటూరులో అనుమతులు లేకుండా వేపనూనె తయారు చేస్తున్న శివనాగేశ్వరరావుతో ఒప్పందం కుదుర్చుకుని.. ఆ నూనె బాటిళ్లను పెద్ద ఎత్తున తీసుకువచ్చి రైతులకు విక్రయించారు. ఒక్కొక్క బాటిల్​పై రూ.300 నుంచి 500 వందల వరకు లాభం చూసుకుని రైతులకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాటిల్ అసలు ధర రూ.999 గా ఉందని.. కానీ ప్రభుత్వం రాయితీ ఇచ్చినందువల్ల రూ.600 వరకు ఇస్తున్నామని చెప్పి, విక్రయించారు. తెలంగాణలోని వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లాలోని ఎస్వీ ఆర్గానిక్స్ సంస్థ లేబుల్ తో డబ్బాలను ప్యాకింగ్ చేశారు.

వ్యవసాయ అధికారుల విచారణ..
ఈ విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ జేడీఏలు శ్రీధర్, కృపాదాస్, గుంటూరు జేడీఏ విజయభారతి.. ప్రత్తిపాడు చేరుకుని విచారణ చేపట్టారు. రైతు భరోసా కేంద్రాలలోని వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ సిబ్బందిని, రైతులను విచారించారు. గుంటూరులో అనుమతులు లేకుండా వేప నూనె తయారు చేస్తున్న కేంద్రంపై దాడులు చేసి తయాడిదారుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆర్బీకేలలో పని చేస్తున్న సిబ్బంది.. ప్రవేట్ వ్యాపారం చేయడం తప్పు అని.. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్తి విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.

ఇదీ చదవండి:

Rain alert in Andhra Pradesh: రాష్ట్రానికి మరోసారి వాన గండం.. వాతావరణ శాఖ హెచ్చరిక

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.