ETV Bharat / state

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ కు అస్వస్థత - Tadepalli news upadte

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి... అస్వస్థతకు గురయ్యారు. గుంటూరులోని తాడేపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Covid Vaccine
ఆశా వర్కర్ కు అస్వస్థత
author img

By

Published : Jan 24, 2021, 10:07 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని పెనుమాకకు చెందిన ఆమె... ఈ నెల 19న కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తర్వాత రెండు రోజులు వరకు ఆరోగ్యం బాగానే ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉన్నట్టుండి చలి, జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం కళ్లు కూడా తెరవలేని స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులు చెప్పడం లేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే ఆమె అనారోగ్యం పాలయ్యిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం పై వైద్యఆరోగ్య శాఖ అధికారులు స్పదించడం లేదని ఆవేదన చెందారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని పెనుమాకకు చెందిన ఆమె... ఈ నెల 19న కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తర్వాత రెండు రోజులు వరకు ఆరోగ్యం బాగానే ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉన్నట్టుండి చలి, జ్వరంతో ఆమె బాధపడుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం కళ్లు కూడా తెరవలేని స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులు చెప్పడం లేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే ఆమె అనారోగ్యం పాలయ్యిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం పై వైద్యఆరోగ్య శాఖ అధికారులు స్పదించడం లేదని ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

ఒకే కుటుంబంలో ఆరుగురు ఎంబీబీఎస్‌లు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.