గుంటూరు నగరపాలక సంస్థలో విలీనమైన పంచాయతీల్లో.. తొలిసారిగా పుర ఎన్నికలు జరుగుతున్నాయి. పలకలూరులో హోంమంత్రి మేకతోటి సుచరిత.. గురువారం సాయంత్రం అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను నేరవేర్చి.. పేదల కళ్లలో ఆనందం తీసుకొచ్చామన్నారు. అటువంటి పాలనను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపునకు అందరూ సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: