గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావు హోంగార్డుగా.. విధులు నిర్వహిస్తున్నారు. అయితే పట్టణంలో జరిగిన.. శ్రీ పంచముఖ ప్రసన్నాంజనేయ స్వామి రథోత్సవంలో భాగంగా ఆయన అక్కడ విధులకు హాజరయ్యారు. రథోత్సవంలో భాగంగా నిర్వహించిన కలశాభిషేకనికి.. మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే స్వామివారికి అభిషేకం చేసేందుకు.. ఓ మహిళ తలపై నీటి బిందె.. మరోవైపు పసికందును ఎత్తుకుని అక్కడకు చేరుకుంది.
ఇది గమనించిన శ్రీనివాసరావు.. ఆ మహిళను చూసి తన చేతిలో ఉన్న పసికందును తన చెంతకు తీసుకున్నాడు. తన మొక్కు తీర్చుకుని రమ్మని ఆ మహిళకు చెప్పారు. అటు విధులు నిర్వహిస్తూనే ఇటు మానవత్వాన్ని చాటుకున్న శ్రీనివాసరావును చూసి ప్రజలు, తోటి సిబ్బంది అభినందించారు.
ఇదీ చదవండి: చోరీ సొత్తులో... రాబట్టింది సగమే!