ETV Bharat / state

ఎంపీ నందిగం వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయవాదుల ఆగ్రహం - latest news on nandhigam suresh

హైకోర్టు తీర్పుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థపై విమర్శలు చేయడం సరికాదని దుయ్యబట్టారు. ఈ అంశంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.

highcourt lawyers fires on nandhigam suresh
నందిగం వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయవాదులు ఆగ్రహం
author img

By

Published : May 26, 2020, 2:23 PM IST

హై కోర్టు తీర్పులు, న్యాయవ్యవస్థపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. గత కొద్ది రోజులుగా ఏపీ హైకోర్టు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో దూషణల పర్వం సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేష్... కోర్టు తీర్పులు ఓ పార్టీ అధినేత వద్ద తయారై వస్తున్నాయని ఆరోపించటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

రాజ్యాంగబద్ధ వ్యవస్థపై... చట్టసభ సభ్యుడిగా ఉండి ఇలాంటి విమర్శలు చేయటం సరికాదని లక్ష్మీనారాయణ అన్నారు. అందుకే సురేష్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్​ను కోరినట్లు వివరించారు. ఈ వ్యాఖ్యల వ్యవహారంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

హై కోర్టు తీర్పులు, న్యాయవ్యవస్థపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. గత కొద్ది రోజులుగా ఏపీ హైకోర్టు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో దూషణల పర్వం సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేష్... కోర్టు తీర్పులు ఓ పార్టీ అధినేత వద్ద తయారై వస్తున్నాయని ఆరోపించటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

రాజ్యాంగబద్ధ వ్యవస్థపై... చట్టసభ సభ్యుడిగా ఉండి ఇలాంటి విమర్శలు చేయటం సరికాదని లక్ష్మీనారాయణ అన్నారు. అందుకే సురేష్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్​ను కోరినట్లు వివరించారు. ఈ వ్యాఖ్యల వ్యవహారంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఎల్జీ పాలిమర్స్ పిటిషన్... ఇక విచారణ చేయబోమన్న సుప్రీం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.