ETV Bharat / state

షాపింగ్ కాంప్లెక్స్​ జీఓ సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు - High court suspended go 79

మంగళగిరి వాసుల కోసం నిర్మించిన ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆస్పత్రిగా విస్తరించేందుకు ఉద్దేశించిన ఎకరం స్థలాన్ని... షాపింగ్ కాంప్లెక్స్​కు కేటాయించడంపై చెంగయ్య అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు లాయర్ నర్రా శ్రీనివాస్ వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు : షాపింప్ కాంప్లెక్స్​ జీఓ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
హైకోర్టు : షాపింప్ కాంప్లెక్స్​ జీఓ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
author img

By

Published : Apr 8, 2021, 7:00 PM IST

Updated : Apr 8, 2021, 7:10 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలోని ఎకరం స్ధలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

చెంగయ్య పిటిషన్..

ఆస్పత్రి ఆవరణలోని ఎకరం స్ధలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం మంగళగిరి మున్సిపాలిటీకి ఇస్తూ ప్రభుత్వం జీఓ నెం 79ను జారీ చేయటంపై హైకోర్టులో చెంగయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

'అలా ఎలా కేటాయిస్తారు'

మంగళగిరి ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఆస్పత్రిని వంద పడకల హాస్పిటల్​గా విస్తరించేందుకు నిర్ణయించిన స్థలాన్ని కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎలా ఇస్తారంటూ పిటీషన్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

'విచారణ 4 వారాలకు వాయిదా'

ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ప్రజోపయోగకరమైన స్ధలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు ఎలా కేటాయిస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం జీఓ నెం 79ని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఫలితం మిగిలింది

గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలోని ఎకరం స్ధలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

చెంగయ్య పిటిషన్..

ఆస్పత్రి ఆవరణలోని ఎకరం స్ధలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం మంగళగిరి మున్సిపాలిటీకి ఇస్తూ ప్రభుత్వం జీఓ నెం 79ను జారీ చేయటంపై హైకోర్టులో చెంగయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

'అలా ఎలా కేటాయిస్తారు'

మంగళగిరి ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఆస్పత్రిని వంద పడకల హాస్పిటల్​గా విస్తరించేందుకు నిర్ణయించిన స్థలాన్ని కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎలా ఇస్తారంటూ పిటీషన్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

'విచారణ 4 వారాలకు వాయిదా'

ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ప్రజోపయోగకరమైన స్ధలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు ఎలా కేటాయిస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం జీఓ నెం 79ని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఫలితం మిగిలింది

Last Updated : Apr 8, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.