ETV Bharat / state

హెల్పింగ్ హ్యాండ్స్ .. ఆకలి తీరుస్తున్న ఆపన్న హస్తాలు

కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలనే మనసుంటే చాలు... సంపదతో పనిలేదని నిరూపిస్తున్నారు గుంటూరుకు చెందిన కొందరు యువకులు. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో బృందంగా ఏర్పడి.. కరోనా లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ఆహారం అందిస్తున్నారు.

author img

By

Published : May 27, 2020, 8:16 AM IST

హెల్పింగ్ హ్యాండ్స్ .. ఆకలి తీరుస్తున్న ఆపన్న హస్తాలు
హెల్పింగ్ హ్యాండ్స్ .. ఆకలి తీరుస్తున్న ఆపన్న హస్తాలు

గుంటూరు నగరంలో హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలు పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. లాక్​డౌన్ కారణంగా కూలీలు సొంతూళ్లకు వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. రెండు నెలలుగా వారికి పని లేదు. వారి యజమానులు కూడా తిండి పెట్టే పరిస్థితి లేదు. పనుల్లేక, తినడానికి తిండిలేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న కొందరు యువకులు హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట బృందంగా ఏర్పడ్డారు. తమ శక్తి కొద్ది నగదు జమ చేశారు.

రోడ్డు పక్కన ఆకలితో ఉండేవారికి మజ్జిగ ప్యాకెట్లు, పుచ్చకాయ ముక్కలు అందజేయటం ప్రారంభించారు. అయితే.. కొందరు అన్నం అడగటంతో.. మరికొందరు స్నేహితులను జతచేసుకుని ఆన్లైన్ ద్వారా విరాళాలు సేకరించారు. అలా వచ్చిన నగదుతో ప్రతిరోజూ ఆహారం సిద్ధం చేసి పేదల కడుపు నింపుతున్నారు. లాక్​డౌన్ కారణంగా కేటిరింగ్ వాళ్లు, వంట మనుషులు దొరికే పరిస్థితి లేక.. యువకులే స్వయంగా ఆహారం తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.

ఎక్కువ మంది దాతలు మధ్యాహ్నం ఆహార పొట్లాలు అందిస్తున్నారు. కానీ రాత్రిళ్లు ఆహారం అందించేవారు తక్కువ. ఈ విషయాన్ని గుర్తించిన హెల్పింగ్ హ్యాండ్స్ బృందం సాయంత్రం 6 గంటల సమయంలో ఆహారం పంపిణీ చేస్తోంది. ఆహారం కోసం అలమటిస్తున్న వారి కష్టం చూసి మనసు కరిగిందని... అందుకే తమకు చేతనైనంతలో సాయం చేస్తున్నామని వారు చెబుతున్నారు. భవిష్యత్తులోనూ తమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

గుంటూరు నగరంలో హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలు పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. లాక్​డౌన్ కారణంగా కూలీలు సొంతూళ్లకు వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. రెండు నెలలుగా వారికి పని లేదు. వారి యజమానులు కూడా తిండి పెట్టే పరిస్థితి లేదు. పనుల్లేక, తినడానికి తిండిలేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న కొందరు యువకులు హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట బృందంగా ఏర్పడ్డారు. తమ శక్తి కొద్ది నగదు జమ చేశారు.

రోడ్డు పక్కన ఆకలితో ఉండేవారికి మజ్జిగ ప్యాకెట్లు, పుచ్చకాయ ముక్కలు అందజేయటం ప్రారంభించారు. అయితే.. కొందరు అన్నం అడగటంతో.. మరికొందరు స్నేహితులను జతచేసుకుని ఆన్లైన్ ద్వారా విరాళాలు సేకరించారు. అలా వచ్చిన నగదుతో ప్రతిరోజూ ఆహారం సిద్ధం చేసి పేదల కడుపు నింపుతున్నారు. లాక్​డౌన్ కారణంగా కేటిరింగ్ వాళ్లు, వంట మనుషులు దొరికే పరిస్థితి లేక.. యువకులే స్వయంగా ఆహారం తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.

ఎక్కువ మంది దాతలు మధ్యాహ్నం ఆహార పొట్లాలు అందిస్తున్నారు. కానీ రాత్రిళ్లు ఆహారం అందించేవారు తక్కువ. ఈ విషయాన్ని గుర్తించిన హెల్పింగ్ హ్యాండ్స్ బృందం సాయంత్రం 6 గంటల సమయంలో ఆహారం పంపిణీ చేస్తోంది. ఆహారం కోసం అలమటిస్తున్న వారి కష్టం చూసి మనసు కరిగిందని... అందుకే తమకు చేతనైనంతలో సాయం చేస్తున్నామని వారు చెబుతున్నారు. భవిష్యత్తులోనూ తమ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.