ETV Bharat / state

ఇళ్ల స్థలాల కోసం భూములిచ్చారు... పరిహారం అందక తిప్పలు పడుతున్నారు...

పేదలకు ఇళ్ల స్థలాల కోసం రైతుల నుంచి భూములను సేకరించిన ప్రభుత్వం వారికి పరిహరం చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 103 బిల్లులకు సంబంధించి 360 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి నగదు వస్తుందనే నమ్మకంతోనే బ్యాంకులో తీసుకున్న రుణాలకు బయట అప్పులు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

author img

By

Published : Nov 6, 2020, 10:54 AM IST

ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములకు పరిహారం అందక రైతులు ఇబ్బందులు
ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములకు పరిహారం అందక రైతులు ఇబ్బందులు

గుంటూరు జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములకు పరిహారం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చివరి విడతలో సేకరించిన భూములకు ఇప్పటికి సొమ్ములు చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా 103 బిల్లులకు సంబంధించి 360కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. భూములు సేకరించే క్రమంలో రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణాలు చెల్లించి సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాకే అధికారులు వాటిని తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు చెల్లించారు. నెలలు గడుస్తున్నా సొమ్ము రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఇచ్చినందున అక్కడ పంటలు సాగు చేయటం లేదు. ఓవైపు పంటలు లేకపోవటం, మరోవైపు చేసిన అప్పులు చెల్లించలేక రైతులు సతమతమవుతున్నారు. అధికారులను అడుగుతున్నా ఎప్పుడు చెల్లించేది స్పష్టంగా చెప్పటం లేదు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్ తెలిపారు. నిధుల లభ్యత ఆధారంగా త్వరలో చెల్లిస్తామన్నారు.

గుంటూరు జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములకు పరిహారం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చివరి విడతలో సేకరించిన భూములకు ఇప్పటికి సొమ్ములు చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా 103 బిల్లులకు సంబంధించి 360కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. భూములు సేకరించే క్రమంలో రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణాలు చెల్లించి సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాకే అధికారులు వాటిని తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు చెల్లించారు. నెలలు గడుస్తున్నా సొమ్ము రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఇచ్చినందున అక్కడ పంటలు సాగు చేయటం లేదు. ఓవైపు పంటలు లేకపోవటం, మరోవైపు చేసిన అప్పులు చెల్లించలేక రైతులు సతమతమవుతున్నారు. అధికారులను అడుగుతున్నా ఎప్పుడు చెల్లించేది స్పష్టంగా చెప్పటం లేదు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్ తెలిపారు. నిధుల లభ్యత ఆధారంగా త్వరలో చెల్లిస్తామన్నారు.

ఇవీ చదవండి

"ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.