ETV Bharat / state

గ్రామీణ చైతన్య పథకాన్ని ప్రారంభించిన శ్రీచిన్నజీయర్​ స్వామి

author img

By

Published : Oct 23, 2020, 10:18 AM IST

గుంటూరు జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో చిన్నజీయర్​ స్వామి, రాష్ట్ర హోంమంత్రితో కలిసి గ్రామీణ చైతన్య పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భార్య సచ్చిదేవి, ఇన్కమ్ టాక్స్ కమిషనర్, నరసారావుపేట ఎంపీ పాల్గొన్నారు.

inaguration of grameena chaithanya scheme
గ్రామీణ చైతన్య పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం

గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో చిన్నజీయర్​ స్వామి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి గ్రామీణ చైతన్య పథకం "ప్రగతి"ని ప్రారంభించారు. గ్రామంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు సోలార్ దీపాలు, ఇస్తరాకులు, టిఫిన్ ప్లేట్లు, గో ఆధారిత మందులు, నూనెలు, డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ వంటి యూనిట్లను ఏర్పాటు చేశారు.

గ్రామాల్లోని యువతీ, యువకులకు ఉపయోగపడేలా గ్రామీణ చైతన్య కార్యక్రమాన్ని స్వామీజీ ప్రారంభించటం హర్షణీయమని హోంమంత్రి అన్నారు. ఈ పథకం ద్వారా యువత తమ నైపుణ్యాలు మెరుగుపరచుకుని, స్వయం ఉపాధి పొందేలా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. గో ఆధారిత వస్తువులు ఆరోగ్యానికి ఎంతో మంచిదని..వాటిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు.

వలసలు ఆపేందుకు, గ్రామాల శక్తిని కాపాడుకోటానికి ఇక్కడే ఉపాధి పొందేలా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చిన్నజీయర్​ స్వామి తెలిపారు. మన దేశంలో ఉన్నంత యువ శక్తి ఏ దేశం లోనూ లేదని, వనరులని సవ్యంగా ఉపయోగించి ప్రగతి సాధించాలన్నారు. ఇటువంటి తయారీ యూనిట్లను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలనేది తమ సంకల్పమని చెప్పారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి సేవలు గ్రామగ్రామాన విస్తరించాలని ఆకాంక్షించారు.

గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో చిన్నజీయర్​ స్వామి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి గ్రామీణ చైతన్య పథకం "ప్రగతి"ని ప్రారంభించారు. గ్రామంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు సోలార్ దీపాలు, ఇస్తరాకులు, టిఫిన్ ప్లేట్లు, గో ఆధారిత మందులు, నూనెలు, డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ వంటి యూనిట్లను ఏర్పాటు చేశారు.

గ్రామాల్లోని యువతీ, యువకులకు ఉపయోగపడేలా గ్రామీణ చైతన్య కార్యక్రమాన్ని స్వామీజీ ప్రారంభించటం హర్షణీయమని హోంమంత్రి అన్నారు. ఈ పథకం ద్వారా యువత తమ నైపుణ్యాలు మెరుగుపరచుకుని, స్వయం ఉపాధి పొందేలా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. గో ఆధారిత వస్తువులు ఆరోగ్యానికి ఎంతో మంచిదని..వాటిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు.

వలసలు ఆపేందుకు, గ్రామాల శక్తిని కాపాడుకోటానికి ఇక్కడే ఉపాధి పొందేలా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చిన్నజీయర్​ స్వామి తెలిపారు. మన దేశంలో ఉన్నంత యువ శక్తి ఏ దేశం లోనూ లేదని, వనరులని సవ్యంగా ఉపయోగించి ప్రగతి సాధించాలన్నారు. ఇటువంటి తయారీ యూనిట్లను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలనేది తమ సంకల్పమని చెప్పారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి సేవలు గ్రామగ్రామాన విస్తరించాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

జై అమరావతి’ నినాదాలతో హోరెత్తిన రాజధాని శంకుస్థాపన ప్రాంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.