గుంటూరు జిల్లా వల్లభాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు జొన్నల కిషోర్ రెడ్డి (34) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతును తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు జొన్నల కిషోర్ రెడ్డి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఖమ్మంలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ కారుకు నిప్పంటించిన స్థానికులు