ETV Bharat / state

అగ్నిప్రమాదాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన

author img

By

Published : Apr 20, 2021, 10:03 AM IST

పలు జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాద నివారణ పరికరాలపై అవగాహన కల్పించారు.

firefighters weeks
అగ్నిమాపక వారోత్సవాలు

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్​లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది ఎయిమ్స్​లో వైద్యులు, నర్సులు, సెక్యూరిటీ సిబ్బందికి.. అగ్నిప్రమాదాల నివారణ గురించి వివరిస్తూ.. మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆసుపత్రిలో ఎటువంటి అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది... అటువంటప్పుడు ఏ విధంగా ఎదుర్కొనాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో అలసత్వంగా వ్యవహరించవద్దనీ.. అలా జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో అగ్నిమాపక వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఏ విధంగా స్పందించాలనే అంశాలను ప్రజలను వివరించారు. ముఖ్యంగా ఇంటిలో వంట చేసేటప్పుడు.. గ్యాస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలనీ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మంటలు అంటుకునే ప్రమాదం ఉందన్నారు.

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కడప అగ్నిమాపక సిబ్బంది... పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పలు కోవిడ్ ఆసుపత్రుల వద్ద అగ్నిప్రమాద నివారణ పరికరాలపై డెమో నిర్వహించారు.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్​లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది ఎయిమ్స్​లో వైద్యులు, నర్సులు, సెక్యూరిటీ సిబ్బందికి.. అగ్నిప్రమాదాల నివారణ గురించి వివరిస్తూ.. మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆసుపత్రిలో ఎటువంటి అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది... అటువంటప్పుడు ఏ విధంగా ఎదుర్కొనాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో అలసత్వంగా వ్యవహరించవద్దనీ.. అలా జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో అగ్నిమాపక వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఏ విధంగా స్పందించాలనే అంశాలను ప్రజలను వివరించారు. ముఖ్యంగా ఇంటిలో వంట చేసేటప్పుడు.. గ్యాస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలనీ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మంటలు అంటుకునే ప్రమాదం ఉందన్నారు.

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కడప అగ్నిమాపక సిబ్బంది... పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పలు కోవిడ్ ఆసుపత్రుల వద్ద అగ్నిప్రమాద నివారణ పరికరాలపై డెమో నిర్వహించారు.

ఇదీ చదవండి:

సీఐడీ విచారణకు దేవినేని ఉమా గైర్హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.